హైద్రాబాద్లో 'కొత్త'వ్యూహంతో విధ్వంసంకు ఐసిస్ ప్లాన్
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఐసిస్ ఉగ్రవాదులు హైదరాబాద్ సహా భారత్లోని పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నారు. కొద్ది రోజుల క్రితం వారాంతంలో హైదరాబాదులో పేలుళ్లు, కాల్పులు జరపాలని ఐసిస్ కుట్ర పన్ని విషయం తెలిసిందే.
హైదరాబాద్ తర్వాత.. అనంతపురంని టార్గెట్ చేసిన ఐసిస్, లాడ్జీలో..
ఇంటెలిజెన్స్ ద్వారా తెలియడంతో ఎన్ఐఏ, పోలీసులు పాతబస్తీలో సోదాలు జరిపారు. ఐదుగురు ఐసిస్ సానుభూతిపరులను అరెస్టు చేశారు. వారిని ఎన్ఐఏ విచారిస్తోంది. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. విధ్వంసానికో సంస్థ పేరును ఐసిస్ ఉపయోగించుకోవాలనుకున్నారని తెలిసింది.

ఇటీవల హైదరాబాదులో విధ్వంసం సృష్టించేందుకు పెట్టుకున్న పేరు.. 'జన్ దుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ ఆల్ హింద్'. వీరిని సిరియాలోని ఐసిస్ ఉ్గరవాద అగ్రనేత షఫీక్ అర్మారే నడిపిస్తున్నారు. హైదరాబాదులో విధ్వంసానికి ఆయనే పై పేరు పెట్టారని తెలుస్తోంది.
హైదరాబాద్పై ఐసిస్ చీఫ్ కన్ను: ఎవరెవరికి ఏయే బాధ్యతలు?
నాలుగు నెలలుగా వీరు అదే పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తేలింది. ఈ పేరుతో మరెక్కడా ఉగ్రవాద సంస్థ లేదు. హైదరాబాదులో పేలుళ్ల కోసమే దీనిని స్థాపించారని తెలుస్తోంది.
హైద్రాబాద్పై ఐసిస్: 'వీరి వెనుక ఎవరో తెలియాలి', కిచెన్లో బాబులు దాచారు
హైదరాబాదులో విధ్వంసానికి ఐసిస్ ఉగ్రవాదులతో కలిసి ప్లాన్ చేశారు. సంప్రదింపుల సమయంలో.. హైదరాబాదులోని పేలుళ్ల కోసం పై పేరుతో చలామణి కావాలని ఐసిస్ టెర్రరిస్టులు సూచించారని తెలుస్తోంది. దీంతో జున్ దుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ ఆల్ హింద్ను స్థాపించారు.
ఐసిస్ ప్లాన్: 'క్రాస్ ఎగ్జాం' షాక్, ఎలా బుట్టలో వేస్తారు?
భారత్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐసిస్.. అన్సార్ ఉల్ తౌహీద్ ఫీ బిలాద్ ఆల్ హింద్ పేరుతో ఒక సంస్థను స్థాపించింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాదులో నలుగురితో పాటు దేశవ్యాప్తంగా 14 మంది ఐసిస్ సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వారు జునూద్ ఆల్ ఖలీఫా ఎ హింద్ పేరుతో సంస్థను స్థాపించి విధ్వంసానికి కుట్ర చేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications