ఐటీ జీవులకు మరో గండం: వచ్చే ఆర్నెళ్లు సంక్లిష్టం.. సర్వేలో తేలిన నిజాలు!
ఎక్స్పెరిస్ ఐటి, మ్యాన్పవర్ గ్రూప్ సర్వేలో మున్ముందు ఐటీ రంగం మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు తేలింది.
Recommended Video

న్యూఢిల్లీ: గత వైభవాన్ని కోల్పోయిన ఐటీకి భవిష్యత్తులోను గడ్డు పరిస్థితులు తప్పేలా లేవు. ఎక్స్పెరిస్ ఐటి, మ్యాన్పవర్ గ్రూప్ సర్వేలో మున్ముందు ఐటీ రంగం మరింత క్షీణించే అవకాశం ఉన్నట్లు తేలడం గమనార్హం.
ఆటోమేషన్, డిజిటైజేషన్ ప్రభావం వల్ల సాంప్రదాయిక ఉద్యోగాలకు భవిష్యత్తు అవకాశాలు కష్టమేనని సర్వే చెబుతోంది. భారత ఐటి కంపెనీల్లో వచ్చే రెండు త్రైమాసికాల్లోనూ ఉపాధి అవకాశాలు తగ్గుతాయని, గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఈసారి భారీగా ఉద్యోగాల కోత తప్పదని హెచ్చరిస్తోంది.

కొత్త ఉద్యోగాలు కష్టమే:
2017 అక్టోబరు నుంచి 2018 మార్చి వ్యవధిలో కొత్త ఉద్యోగాల కల్పన తీవ్రంగా మందగిస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఉన్న ఉద్యోగుల్లోనే ప్రతిభావంతమైన, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఐటీ పరిశ్రమ సద్దుబాటు చేసుకుంటోందని పేర్కొంది.

కనివిని ఎరుగుని రీతిలో లేఆఫ్లు:
సీనియర్ స్థాయి ఉద్యోగులను లేఆఫ్ ల ద్వారా సాగనంపి, జూనియర్, మధ్య స్థాయిలో కొత్త నియమాకాలను చేపట్టే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. దేశంలోని అగ్రగామి ఐటి కంపెనీలన్నింటిలోను ఇంతకుముందెన్నడూ లేని రీతిలో.. కనివినీ ఎరుగని స్థాయిలో లేఆఫ్ లు ఉండవచ్చునని తెలిపింది. వచ్చే 6 నుంచి 12 నెలల కాలం కొత్త నియామకాలు మరింతగా క్షీణిస్తాయని తెలిపింది.

వీటికే డిమాండ్:
వేగంగా మారుతున్న టెక్నాలజీని ఎవరైతే అందిపుచ్చుకోగలుగుతారో.. భవిష్యత్తులో వారికే ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉంటాయని సర్వే తెలిపింది. కాబట్టి వచ్చే 12 నెలల కాలంలో ఐటి రంగంలోని నిపుణులందరూ డిమాండు అధికంగా ఉన్న కొత్త టెక్నాలజీలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించింది.
సర్వీసుగా సాఫ్ట్వేర్ (సాస్), క్లౌడ్, ఇఆర్పి సాఫ్ట్వేర్, కృత్రిమ మేదస్సు వంటి విభాగాల్లో ఐటీ ఉద్యోగులకు మంచి అవకాశాలున్నాయని ఎక్స్పెరిస్ ప్రెసిడెంట్ మన్మీత్ సింగ్ తెలిపారు. అమిత వేగం, నూరు శాతం విశ్వసనీయత, తక్కువ ధరలకు అందుబాటులో ఉండే టెక్నాలజీకే భవిష్యత్తు అని ఆయన అన్నారు.

స్కిల్స్ పెంచుకుంటేనే:
ఐటి రంగంలో క్రమంగా వస్తున్న మార్పులు.. దాని తాలుకు సాంకేతిక పరిజ్ఞానాలు సంక్లిష్టంగా ఉంటాయంటున్నారు మన్మీత్ సింగ్. తమ ప్రతిభకు ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకునే యంగ్ ప్రొఫెషనల్స్ కు ఇవి మంచి అవకాశాలను కల్పిస్తాయన్నారు.
ఐటి రంగంలో స్థూలంగా నియామకాల వాతావరణం సానుకూలంగానే ఉన్నప్పటికీ.. నైపుణ్యాలకు మెరుగులు దిద్దడం, కొత్త నైపుణ్యాలను నేర్పించడం పైనే ఆ రంగంలోని సంస్థలు దృష్టి పెడతాయని ఆయన అన్నారు.

సుశిక్షితులకే అవకాశాలు:
చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చే ఆలోచనలో లేవన్నారు మన్మీత్ సింగ్. సుశిక్షితులైన కొత్త వారినే కంపెనీలు ఎంపిక చేసుకునే అవకాశం ఉందన్నారు. సమయం, ఖర్చు రీత్యా పాత ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలను నేర్పించే రిస్క్ ను కంపెనీలు ఎదుర్కొవడానికి సిద్దంగా లేవన్నారు.
ట్రైనింగ్ పీరియడ్ తగ్గించడం కోసం ప్రొబేషన్ కాలపరిమితిని ముందుకు జరపడం కూడా ఐటి రంగంలో కొత్త సాంప్రదాయం కాగలదని ఆయన అభిప్రాయపడ్డారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications