ఈసారి ఖైరతాబాద్ గణేషుడు ఎలా ఉండబోతున్నాడు?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా నగరంలోని ఖైరతాబాద్ గణేషుడు అంటే దేశ వ్యాప్తంగా పేరుంది. మరి ఈసారి మన ఖైరతాబాద్ గణేషుడు ఏవిధంగా దర్శనమివ్వబోతున్నాడో తెలుసుకుందాం.
ఖైరతాబాద్ గణేషుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వారుండరంటే నమ్మండి. అంత ఘనంగా ఇక్కడ గణేషుని పూజ నిర్వహించి, నిమజ్జనం చేస్తారు. ఈసారి ఖైరతాబాద్ భారీ గణపతి త్రిశక్తిమయ మోక్ష గణపతిగా దర్శనమివ్వనున్నాడు.
59 అడుగుల ఎత్తు, 26 అడుగుల వెడల్పుతో ఇరువైపులా మహాలక్ష్మీ, మహా సరస్వతి దేవిలతో పాటు కుడివైపున వరంగల్ భద్రకాళి అమ్మవార్లతో కలిపి మూడు శక్తులతో భక్తుల పూజలు అందుకోబోతున్నాడు.
భారీ గణపతి తయారీ ప్రాంగణంలో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సింగరి సుదర్శన్, శిల్పి చినస్వామి రాజేంద్రన్, కన్వీనర్ సందీప్ రాజ్లు గురువారం నమూనా చిత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణతో పాటు భారతదేశంలో కరువు రాకుండా ఉండేందుకు, సమస్త జనులు సుఖశాంతులతో ఉండాలని కాంక్షిస్తూ, మూడు శక్తులతో కూడిన గణపతి తయారు చేయాలని ప్రముఖ సిద్ధాంతి గౌరీభట్ల విఠల్ శర్మ సూచించిన మేరకు ఈ తరహా వినాయకుడిని తయారు చేస్తున్నట్లు వారు తెలిపారు.
భారీ సింహాసనం ముందు విల్చుని ఆరు చేతులతో భారీ ఆకారంలో గణపతి నిర్మాణాన్ని తయారు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మహాలక్ష్మీ, మహా సరస్వతిల విగ్రహాలు 10 అడుగుల ఎత్తులో వినాయకుడికి ఇరువైపులా దర్శనమివ్వనున్నట్లు తెలిపారు.
వీటితోపాటు గణపతికి ఎడమవైపున గజేంద్ర మోక్షాన్ని కనులారా వీక్షించే విధంగా విగ్రహాలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. 20 అడుగుల ఎత్తు, ప్రత్యేక దేవాలయాన్ని పోలే ఆర్చితో రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
కుడివైపున వరంగల్లో కొలువు దీరిన భద్రకాళి అమ్మవారి విగ్రహాన్ని 20 అడుగుల ఎత్తుతో తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 12వ తేదీన కర్రపూజతో వినాయకుడి తయారీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రస్తుతం వెల్డింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి.
ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ మాట్లాడుతూ విగ్రహ నమూనాలో స్వల్ప మార్పులుంటాయని అన్నారు. మహాలక్ష్మీ, మహా సరస్వతి విగ్రహాల వెనుక భాగంలో రెండు హంసలు వస్తాయని, భారీ గణపతి తలపై గొడుగు స్దానంలో పడగలతో కూడిన పాము ఉంటుందని తెలిపారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications