సమైక్యం రెండు: జగన్ అటు, వీరు ఇటు (ఫొటోలు)
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో సమైక్యాంధ్ర కోసం సాగుతున్న పోరాటం రెండు పాయలుగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో సోమవారం జరిగిన రెండు ధర్నాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిగింది. మరోవైపు అశోక్ బాబు నేతృత్వంలోని ఎపిఎన్జీవోల ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో ర్యాలీ జరిగింది.
రామ్ లీలా మైదానంలో జరిగిన ధర్నాలో సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో ఎపిఎన్జీవోలు తమ గళాలు వినిపించారు. సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. సమైక్యాంధ్ర ప్లకార్లులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెసు తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు లగపాటి రాజగోపాల్ పాల్గొన్నారు.
రామ్ లీలా మైదానంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వర రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజనను ఆపాలంటూ వారు డిమాండ్ చేశారు.

సేవ్ ఆంధ్రప్రదేశ్
రామ్ లీలా మైదానంలో జరిగిన ర్యాలీలో ఉద్యోగులు సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డులను ప్రదర్శిస్తూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోటెత్తారు.

రామ్ లీలా మైదానంలో ఇలా..
ఎపిఎన్జీవోల ఆధ్వర్యంలో రామ్ లీలా మైదానంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో పచ్చని వస్త్రాలను మెడ చుట్టూ వేసుకుని ఇలా దర్శనమిచ్చారు.

సమైక్యాంధ్ర కోసం...
సమైక్యాంధ్ర కోసం రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రామ్ లీలా మైదానం సీమాంధ్రులతో ఇలా నిండిపోయింది

బూర్గుల, పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రామ్ లీలా మైదానంలో పొట్టి శ్రీరాములు, బూర్గుల రామకృష్ణారావు, తెలుగుతల్లి చిత్రాలతో పోస్టర్ను ఏర్పాటు చేశారు.

చేతులెత్తారు...
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నాయకులు రామ్ లీలా మైదానంలో ఇలా చేతులు ఎత్తి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

అశోక్ బాబు ఇలా..
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు తన ప్రసంగాన్ని సాగించారు.

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రామ్ లీలా మైదానంలో సోమవారం సీమాంధ్ర ప్రజలు ఇలా సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డులను ప్రదర్శించారు.

నిలిచిన వనిత...
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎపిఎన్జీవోల సంఘం బ్యానర్తో ఓ మహిళ ఇలా నిలిచారు. ఆమె చుట్టూ ఇలా టోపీలతో మహిళలు..

పార్లమెంటు వద్ద నిరసన
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు సోమవారం పార్లమెంటు ఆవరణలో ఇలా నిరసన తెలిపారు.

పార్లమెంటు వద్ద టిడిపి సీమాంధ్ర ఎంపీలు..
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఇలా నిరసన వ్యక్తం చేశారు.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications