మోడీపై రాహుల్ సంచలన ఆరోపణలు: సుప్రీం గతంలో కొట్టేసినవే!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అవినీతికి పాల్పడ్డారు, ముడుపులు తీసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, అందుకు తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయంటూ చెప్పారు. అయితే, అవన్నీ పనికిమాలిన ఆరోపణలని, జీరో అని, మాయ అని సుప్రీంకోర్టు ఇప్పటికే వాటిని కొట్టివేయడం గమనార్హం.
ఆ వివరాల్లోకి వెళితే.. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న సమయంలో ఆయనతోపాటు పలువురు రాజకీయ నాయకులకు కార్పొరేట్ పెద్దలు ముడుపులు చెల్లించారని ఆరోపిస్తూ ప్రముఖ న్యాయవాది, మాజీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ గతంలోనే పిల్ దాఖలు చేశారు.
ఆదిత్య బిర్లా, సహారా గ్రూపులు కొన్నేళ్ల పాటు రాజకీయ నాయకులకు భారీ మొత్తంలో లంచాలు ఇచ్చాయనడానికి ఈ పత్రాలు ఆధారమని ప్రశాంత భూషణ్ తన పిల్లో ఆరోపించారు. 2013 అక్టోబర్, నవంబర్ నెలల్లో గుజరాత్ సీఎంకు భారీ మొత్తం ఇచ్చినట్లు సహారా పత్రాల్లో ఉందన్నారు. అప్పట్లో ప్రశాంత్ భూషణ్ బయటపెట్టిన పత్రాలనే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చూపించడం గమనార్హం.
కాగా, విచారణకు ఆదేశించడానికి ఈ పత్రాలు విశ్వనీయమైనవి కావని సుప్రీం అప్పట్లో కొట్టేసింది. జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ అరుమ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. నవంబర్ 25న ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రిపై ఆరోపణలను నిరూపించాలంటూ మరింత విశ్వసనీయమైన సాక్ష్యాలు తీసుకురావాలని కోర్టు ప్రశాంత్ భూషణ్కు తెలిపింది.

'మీరు సహారా పత్రాల మీద ఆధారపడుతున్నారా? వాళ్లెప్పుడూ అసలైన పత్రాలు ఇవ్వరు' అని జస్టిస్ ఖేహర్ చెప్పారు. తాము ఈ పత్రాలతో ఏమాత్రం సంతృప్తి చెందలేదని, అవినీతిపరుడైన ఏ వ్యక్తి అయినా ప్రధానమంత్రి పేరుతో ఒక ఎంట్రీ వేయొచ్చు గానీ, దాన్ని విశ్వసనీయమైన సాక్ష్యంగా పరిగణించలేమని ఆయన అన్నారు.
ఈ కేసు విచారించడానికి తాము భయపడటం లేదని, కానీ కేవలం బిర్లా, సహారా గ్రూపుల నుంచి తెచ్చిన పత్రాలు ఏమాత్రం పనికిరానివని కోర్టు చెప్పింది. ఇవి సున్నా అని, మరింత విశ్వసనీయమైన సాక్ష్యాధారాలు తేవాలని సూచించింది. కానీ, సరిగ్గా ఇలా సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆధారాలనే తీసుకొచ్చి రాహుల్ గాంధీ గుజరాత్లోని మెహసానాలో అవే ఆరోపణలు చేశారు.
ఇప్పటికే రాహుల్ సృష్టిస్తానన్న 'భూకంపం' గురించి సోషల్ మీడియాలో జోకులు పేలుతుండగా, ఇప్పుడు ఇలా సుప్రీంకోర్టు తిరస్కరించిన ఆధారాలు తీసుకొచ్చి ఆరోపణలు చేయడంతో అవి కూడా తేలిపోవడం కాంగ్రెస్ పార్టీకి కొంత నిరాశ కలిగించే అంశంగా మారింది. ఇది ఇలా ఉంటే, సుప్రీంకోర్టు.. మోడీపై వచ్చిన ఆరోపణల్లో మరిన్ని పత్రాలు పరిశీలించాల్సి ఉందని ప్రశాంత్ భూషణ్ బుధవారం గమనార్హం. అవి కూడా పరిశీలించాలని కోరారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్..












Click it and Unblock the Notifications