Bank Rules: శ్మశానాన్ని తవ్విన పేదరికం. అక్క అస్థిపంజరంతో..

ప్రాణం పోయినా రూల్స్ మారవు.. మనిషి మట్టిలో కలిసినా కనికరం పుట్టదు.. వ్యవస్థల నిర్లక్ష్యానికి, మానవత్వపు మరణానికి అద్దం పట్టిన ఒడిశా విషాదం! మనందరిని ఆలోచింపజేస్తుంది. దేశంలో వ్యవస్థలపై మరోసారి ఛీ అనిపించే అభిప్రాయం కలిగేలా చేస్తుంది.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.. కానీ ఆ చట్టానికి కళ్లుండవు, కన్నీళ్లు అస్సలే ఉండవని ఈ ఘటన నిరూపించింది. కడుపు కోతతో అక్కను కోల్పోయిన ఆ తమ్ముడికి, కనీసం ఆమె దాచుకున్న సొమ్మును ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థ, 'ఖాతాదారుడు వస్తేనే గాని డబ్బులు ఇవ్వం' అంటూ మొండికేసింది. ఆ నిబంధనల గోడను బద్దలు కొట్టడానికి, మనసు కలిచివేసేలా.. తన సోదరి అస్థిపంజరాన్ని భుజాన వేసుకుని బ్యాంకు ముందు నిలబడ్డాడు ఒక గిరిజనుడు. ఇది ఒక వ్యక్తి ఆవేదన మాత్రమే కాదు, సామాన్యుడిపై వ్యవస్థ చేస్తున్న అమానవీయ దాడికి పరాకాష్ట.

Heartbreaking Odisha News Tribal Man Brings Sister s Remains to Bank to Withdraw Her Savings of Rs 19300

సమాధిని తవ్విన పేదరికం.. సాక్ష్యంగా మిగిలిన అస్థిపంజరం

ఒడిశాలోని కియోంఘర్ జిల్లా దియానలి గ్రామానికి చెందిన జితు ముండా కథ వింటే రాతి గుండె కూడా కరుగుతుంది. జనవరిలో చనిపోయిన తన సోదరి కల్రా ముండా ఖాతాలో ఉన్న రూ.19,300 కోసం ఆయన మూడు నెలలుగా తిరగని గడప లేదు. "ఆమె చనిపోయింది.. ఇదిగో డెత్ సర్టిఫికేట్" అని మొరపెట్టుకున్నా, బ్యాంకు అధికారుల సమాధానం ఒక్కటే.. "ఖాతాదారు రావాల్సిందే!". చనిపోయిన మనిషి ఎలా వస్తుందని అడిగే జ్ఞానం లేని వ్యవస్థకు, తన సోదరిని భౌతికంగా చూపించడమే మార్గమని భావించాడు ఆ అమాయక గిరిజనుడు.

శ్మశానంలో పూడ్చిపెట్టిన తన సోదరి అవశేషాలను తవ్వి తీసి, సుమారు 3 కిలోమీటర్లు ఆ అస్థిపంజరాన్ని మోసుకుంటూ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు ప్రాంగణంలో ఆ అస్థిపంజరాన్ని ఉంచి, "ఇదిగో నా సోదరి.. ఇప్పుడు డబ్బులు ఇస్తారా?" అని ఆయన అడుగుతుంటే, అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు.

నిబంధనల ముసుగులో నిర్లక్ష్యం..

బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం వారసులకు (Nominee) డబ్బులు అందజేసే ప్రక్రియ ఉన్నప్పటికీ, కనీస అవగాహన కల్పించకుండా జితును తిప్పడం అధికారుల వైఫల్యాన్నే సూచిస్తోంది. ఒక గిరిజనుడికి నామినీ ప్రక్రియ గురించి, వారసత్వ ధృవీకరణ పత్రాల గురించి వివరించాల్సిన బాధ్యతను మరిచి, "ఆమెను తీసుకురా" అని చెప్పడం అమానవీయం.

"చట్టాలు మనుషుల కోసం ఉండాలి కానీ, మనుషులే చట్టాల కోసం బలికాకూడదు. జితు ముండా చేసిన పని సమాజానికి ఒక హెచ్చరిక."

పోలీసులు జోక్యం చేసుకుని జితుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే, ఒక పేదవాడు తన ఆవేదనను వినిపించుకోవడానికి శ్మశానాన్ని కూడా తవ్వాల్సి రావడం మన వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం. నిబంధనలు అవసరమే, కానీ ఆ నిబంధనల వెనుక 'మానవత్వం' అన్న చిన్న పదాన్ని అధికారులు గుర్తుంచుకుంటే ఇలాంటి హృదయ విదారక దృశ్యాలు పునరావృతం కావు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+