Ganga Expressway: రోడ్డు కాదు.. రాకెట్ రన్ వే!
ఉత్తరప్రదేశ్ గుండెల్లోంచి ప్రవహించే పవిత్ర గంగానది సాక్షిగా.. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసే మరో మహా అద్భుతం సాకారమైంది. ఇది కేవలం తారు రోడ్డు కాదు.. ఉత్తరప్రదేశ్ ప్రగతి రథం! పశ్చిమాన మీరట్ నుంచి తూర్పున ప్రయాగ్రాజ్ వరకు 594 కిలోమీటర్ల మేర సాగే ఈ 'గంగా ఎక్స్ప్రెస్వే' భారతావనిలోనే ఒక ఇంజనీరింగ్ వింత. బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ మహత్తర ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తూ, యూపీని దేశానికే 'ఎక్స్ప్రెస్వేల రాజధాని'గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్లోనే అతి పొడవైన ఈ ఎక్స్ప్రెస్వే భారతదేశంలోని ప్రముఖ గ్రీన్ఫీల్డ్ రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టులలో ఒకటి.
ఒకప్పుడు మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లాలంటే సూర్యుడు ఉదయించి అస్తమించినా ప్రయాణం పూర్తయ్యేది కాదు. 12 గంటల సుదీర్ఘ ప్రయాణం ఇప్పుడు కేవలం 6 గంటలకే పరిమితమైంది! గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వాహనాలకు ఈ ఆరు లేన్ల రహదారి ఒక స్వర్గధామం. రాబోయే రోజుల్లో దీనిని 8 లేన్లకు విస్తరించేలా అద్భుతమైన ప్లానింగ్తో నిర్మించారు. రూ.36,230 కోట్ల అంచనా వ్యయంతో నిర్మితమైన ఈ ఎక్స్ప్రెస్వే, పారిశ్రామిక వేగానికి కొత్త అర్థం చెప్పబోతోంది.

ఆకాశమే హద్దు.. రక్షణే మా బాధ్యత!
గంగా ఎక్స్ప్రెస్వే కేవలం ప్రయాణికుల కోసమే కాదు, దేశ రక్షణలోనూ కీలక పాత్ర పోషించబోతోంది. షాజహాన్పూర్ వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల ఎయిర్స్ట్రిప్ ఒక అద్భుతం. యుద్ధ సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో భారీ యుద్ధ విమానాలు నేరుగా ఈ రహదారిపై ల్యాండ్ అయ్యేలా దీన్ని తీర్చిదిద్దారు. అంటే, ఇది అవసరమైతే 'రన్ వే'గా మారుతుందన్నమాట!
లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షలాది ఉద్యోగాలు!
ఈ రహదారి వెంట 12 పారిశ్రామిక క్లస్టర్లు మొలకెత్తబోతున్నాయి. ఆహార శుద్ధి పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్లు, తయారీ కేంద్రాల కోసం ప్రభుత్వం ఇప్పటికే 6,500 ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. ఫలితంగా రూ.47,000 కోట్ల భారీ పెట్టుబడులు రాష్ట్రంలోకి ప్రవహించనున్నాయి. తద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
12 జిల్లాల భాగ్యరేఖ!
మీరట్, హాపూర్ నుండి మొదలై బులంద్షహర్, అమ్రోహా, షాజహాన్పూర్, రాయ్బరేలి మీదుగా ప్రయాగ్రాజ్ వరకు.. మొత్తం 12 జిల్లాలను అనుసంధానిస్తూ సాగే ఈ మార్గం, తూర్పు మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్ల మధ్య ఉన్న అడ్డుగోడలను కూల్చేసింది.












Click it and Unblock the Notifications