విజయ్ క్లోజ్ మార్జిన్: కౌంటింగ్ నాడు 14 మందితో..

తమిళనాడులో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఇక అందరి దృష్టీ కూడా మే 4న జరగనున్న ఓట్ల లెక్కింపుపై పడింది. ఈ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయ్ నూతన రాజకీయ శక్తిగా రంగప్రవేశం చేయడం దీనికి ప్రధాన కారణం. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కజగం రాష్ట్రవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చింది. గెలుపోటముల అంతర్యాన్ని తగ్గించడమే కాకుండా, ఫలితాలను తారుమారు చేయగలిగుతుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

త్రిముఖ పోరు..

కొన్ని నియోజకవర్గాల్లో మూడు అంకెల్లోపే ఆధిక్యత ఉండొచ్చనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి. అతి తక్కువ మెజారిటీ ఓట్ల తేడాతో ఫలితాలను టీవీకే నిర్ణయిస్తుందని, క్లోజ్ మార్జిన్ తో డీఎంకే, ఏఐఏడీఎంకేల ఓటు బ్యాంక్ ను కొల్లగొడుతుందని, ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొన్నందున ఫలితాలు ఎటు వైపు మొగ్గినా ఆశ్చర్యపడనక్కర్లేదని అంచనా వేస్తున్నారు. ఈసారి మొత్తం 234 నియోజకవర్గాల్లో 84 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం దీనికి నిదర్శనం.

Vijay Calls for Strong Room Monitoring in Zoom Meeting With Aadhav Arjuna As Close Margin Expected

యువతపెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడం..

ప్రత్యేకించి- విజయ్ గట్టి పట్టు ఉన్న యువతపెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడం వల్ల అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములు తారుమారు అవ్వొచ్చని అంటున్నారు. అనేక సంవత్సరాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పెద్ద పార్టీల మధ్య ద్విముఖ పోటీగానే సాగిన తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఈసారి మారిందని అభిప్రాయపడుతున్నారు.

తక్కువ ఓట్ల తేడాతో..

గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములు తక్కువ ఓట్ల తేడాతోనే తేలాయనేది స్పష్టమవుతోంది. 2011 ఎన్నికల్లో 9 నియోజకవర్గాలు, 2016లో 16 నియోజకవర్గాలు, 2021లో 8 నియోజకవర్గాల్లో వెయ్యి ఓట్ల లోపు తేడాతో విజయం ఖరారైంది. అంతేకాకుండా 1,000 నుండి 5,000 ఓట్ల తేడాతో ఫలితాలు వెలువడిన నియోజకవర్గాల సంఖ్య కూడా ప్రతి ఎన్నికలో గణనీయంగానే నమోదవుతూ వస్తోంది.

ఇప్పుడు కూడా..

తక్కువ ఓట్ల తేడాలు అనేక సీట్లలో ఫలితాలను తారుమారు చేస్తాయనేది బహిరంగ రహస్యమే. ఇప్పుడు కూడా ఇది పునరావృతం కావచ్చని చెబుతున్నారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతృత్వంలోని, అనేక పార్టీలను కలుపుకున్న బలమైన కూటమి అద్భుత విజయం సాధించింది. 2016, 2021 శాసనసభ ఎన్నికలు కూడా బహుముఖ పోటీగానే కొనసాగాయి. ఓట్లు చీలడం వల్ల అనేక నియోజకవర్గాల్లో తక్కువ ఓట్ల తేడాతో ఫలితాలు వెలువడ్డాయి.

యువత, తొలిసారి ఓటర్లు..

2026 ఎన్నికలు మరింత భిన్నంగా ఉంటాయని అంచనా. డీఎంకే, అన్నాడీఎంకే, నామ్ తమిళర్, తవేక పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. యువత, తొలిసారి ఓటర్లు, రాజకీయ ఆసక్తి లేని వర్గాలు సైతం ఈసారి మార్పు కోసమే ఓటు వేసి ఉండవచ్చని విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈసారి చాలా నియోజకవర్గాల్లో గెలుపోటముల తేడా అత్యంత తక్కువగా ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో..

కొన్ని చోట్ల 500 లేదా 1,000 ఓట్ల స్వల్ప తేడాతోనే విజేతలు నిర్ణయించేంత గట్టి పోటీ ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది మాత్రమే కాకుండా, ఎన్ని నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఫలితాలు మారతాయనేది కీలక చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల కంటే ఈసారి అంతకంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఇటువంటి పరిస్థితి రావచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జూమ్ కాల్ మీటింగ్..

ఈ నేపథ్యంలో విజయ్.. నేడు పార్టీ నాయకులతో జూమ్ కాల్ మీటింగ్ లో మాట్లాడారు. ఆధవ్ అర్జున సహా పలువురు పార్టీ సీనియర్ నేతలు ఇందులో పాల్గొన్నారు. అన్ని స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పార్టీ అభ్యర్థులు నిఘా ఉంచడం, కౌంటింగ్ రోజున 14 మందితో ప్రత్యేకంగా కమిటీ వేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఓటు అత్యంత విలువైనదిగా పరిగణించాలని, చిట్టచివరి ఓటు లెక్కించేంత వరకూ ఎవరూ పోలింగ్ కేంద్రాలను వీడి వెళ్లకూడదని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+