సర్వేల మధ్య భీకర సమరం.. బెంగాల్‌లో ఉత్కంఠ పోరు!

కొద్దిసేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనిశ్చితిని పెంచాయి. కొన్ని సంస్థలు బీజేపీకి అధికారాన్ని కట్టబెడుతుండగా, మరికొన్ని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ విరుద్ధమైన అంచనాలు బెంగాల్ ఓటరు నాడిని పట్టుకోవడంలో నిపుణులు కూడా తడబడుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికారం దక్కించుకోవాలంటే 148 స్థానాలు అవసరం. అయితే, వివిధ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను క్రోడీకరించి చూస్తే (Poll of Polls), ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కకపోవచ్చనే సంకేతాలు అందుతున్నాయి. తాజా అంచనాల ప్రకారం.. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ కూటమి 146 స్థానాల్లో గెలిచే అవకాశం ఉండగా, బీజేపీ కూటమి 140 స్థానాలను కైవసం చేసుకునే దిశగా దూసుకుపోతోంది. అంటే కేవలం రెండే రెండు సీట్ల తేడాతో టీఎంసీ మేజిక్ ఫిగర్‌కు అతి చేరువలో నిలిచింది.

West Bengal Poll of Polls 2026 TMC Leads with 146 Seats in a Tight Race BJP Trails Closely with 140

కాషాయ దళానిదే పైచేయి అంటున్న 'చాణక్య, మ్యాట్రిజ్'

ప్రముఖ సర్వే సంస్థలు చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్ విడుదల చేసిన గణాంకాలు బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ రెండు సంస్థల అంచనాల ప్రకారం.. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 148ని దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది. ఏబీపీ (ABP) అంచనాల ప్రకారం కూడా బీజేపీకి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉంది. అయితే, టీఎంసీ అత్యంత చేరువలో ఉందని, స్వల్ప ఓట్ల తేడాతోనే ఫలితాలు తలకిందులయ్యే ఛాన్స్ ఉందని ఈ సర్వేలు హెచ్చరిస్తున్నాయి.

దీదీ పతనం ప్రారంభం? కళ్లు బైర్లు కమ్మే అంచనాలు
దీదీ పతనం ప్రారంభం? కళ్లు బైర్లు కమ్మే అంచనాలు

మమతమ్మకే 'పీపుల్స్ పల్స్' పట్టం!

దీనికి పూర్తి భిన్నంగా పీపుల్స్ పల్స్ సంస్థ టీఎంసీకి క్లీన్ స్వీప్ అంచనా వేసింది. మమతా బెనర్జీ సునాయాసంగా మెజారిటీ సాధించి నాలుగోసారి అధికారాన్ని చేపడతారని, బీజేపీ చాలా వెనుకబడి ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. ఇతర ఏజెన్సీలతో పోలిస్తే పీపుల్స్ పల్స్ అంచనాలు టీఎంసీకి అత్యధిక సీట్లు ఇవ్వడం గమనార్హం. ఈ భారీ వ్యత్యాసం తుది ఫలితాలపై సందిగ్ధతను మరింత పెంచింది.

West Bengal Exit Poll 2026: దీదీకి షాక్! దూసుకెళ్తున్న బీజేపీ..
West Bengal Exit Poll 2026: దీదీకి షాక్! దూసుకెళ్తున్న బీజేపీ..

గత అనుభవాలు.. ఆశ్చర్యకరమైన మలుపులు

2021 ఎన్నికల ఫలితాలను గుర్తుచేసుకుంటే.. అప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ-టీఎంసీ మధ్య గట్టి పోటీ ఉంటుందని అంచనా వేశాయి. కానీ, వాస్తవ ఫలితాల్లో మమతా బెనర్జీ భారీ మెజారిటీతో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడూ తుది ఫలితాన్ని ఖచ్చితంగా ప్రతిబింబించలేవని, ఓట్ల లెక్కింపు రోజున ఆశ్చర్యకరమైన మలుపులు చోటుచేసుకోవడం బెంగాల్ రాజకీయాల్లో సహజమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+