ఏఐ అసభ్య వీడియోలపై గూగుల్, యూ ట్యూబ్ లకు ఐశ్వర్యారాయ్ దంపతుల షాక్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు అన్ని రంగాలలో తన సత్తా చాటుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి పనులకే కాదు, సమాజంలో చెడు ప్రభావాలను కూడా చూపిస్తుంది. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారుచేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఏది ఒరిజినల్ వీడియో, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన వీడియో అనేది అర్థం కాకుండా ఉన్నాయి. అయితే ఇది ముఖ్యంగా సినీ సెలబ్రిటీలకు తలనొప్పిగా తయారైంది.
కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సినీ సెలబ్రిటీలకు సంబంధించిన అసభ్యకర వీడియోలు తయారుచేసి వాటిని యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల తమ అనుమతి లేకుండా ఫోటోలు వినియోగిస్తున్నారని బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా అనేక వెబ్సైట్లు తమ పేరును ఉపయోగించి వాళ్ళు వస్తువులను కూడా విక్రయిస్తున్నాయి అని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

యూ ట్యూబ్, గూగుల్ లకు ఐశ్వర్యారాయ్ దంపతుల షాక్
వీరి పిటిషన్ ను స్వీకరించిన ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఉన్న వాటిని తొలగించేలా ఆదేశాలు ఇస్తామని కోర్టు వెల్లడించింది. ఇక ఇదే సమయంలో తాజాగా మరోమారు ఐశ్వర్యరాయ్, అభిషేక బచ్చన్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా యూట్యూబ్, గూగుల్ తమ ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆ సంస్థలపైన నాలుగు కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు.
ఏఐతో చేసిన అసభ్య వీడియోలపై కోర్టులో 4 కోట్ల పరువు నష్టం దావా
ఏఐ సహాయంతో. తయారుచేసిన అసభ్య వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. అంతేకాదు లైంగికపరమైన అసభ్యకరమైన వీడియోలతో ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఏఐ బాలీవుడ్ ఇష్క్ అనే ఛానల్ లో 259 వీడియోల కంటే ఎక్కువ వీడియోలు ఉన్నాయని వారి పేర్కొన్నారు. కనక తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా వీడియోలు ఫోటోలను వాడుతున్న గూగుల్, యూట్యూబ్ ల పైన చర్యలు తీసుకోవాలని, నాలుగు కోట్ల పరిహారం ఇవ్వాలని వారు కోర్టుకు విన్నవించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications