ఇంటర్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్పై మీ కామెంట్ ఏంటి?
హైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఖరిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం రణరంగాన్ని తలపించగా.. విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. అధికారులు, విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ఎట్టకేలకూ ప్రభుత్వం స్పందించి ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీవెరిఫికేషన్, రీ వాల్యుయేషన్ నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే ఇంతటి రచ్చకు బాధ్యులెవరన్నది వారిపై ఎలాంటి చర్య తీసుకోబోతున్నారన్న అంశాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినందుకు ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని అంటున్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి రాజీనామాకు విద్యార్థులు పట్టుబడుతుండటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.













Click it and Unblock the Notifications