ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ సభ ఫెయిల్ కావడానికి కారణాలేంటని భావిస్తున్నారు? మీ కామెంట్ చెప్పండి
హైదరాబాద్ : కారు - సారు - పదహారు నినాదంతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ అట్టర్ ఫ్లాపైంది. నాలుగు కీలక నియోజకవర్గాలైన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఓటర్లను ఆకట్టుకునేందుకు నిర్వహించిన సభకు కేసీఆర్ గైర్హాజరయ్యారు. భారీ జన సమీకరణకు ప్లాన్ వేసినా ప్రజలెవరూ సభకు రాకపోవడంతో టీఆర్ఎస్ నేతలు తూతూ మంత్రంగా సభ నిర్వహించారు.
షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సాయంత్రం 5.30గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉంది. అప్పటికి మిర్యాలగూడ బహిరంగసభలో ఉన్న కేసీఆర్ తన ప్రసంగం మధ్యలో హైదరాబాద్ సభకు ఆలస్యమవుతోందన్న అంశాన్ని ప్రస్తావించారు. అయితే మీటింగ్ ప్రారంభ సమయం దాటినా జనం లేక స్టేడియం వెలవెలబోయింది. ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఈ సమాచారం అందుకున్న సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియం సభను రద్దుచేసుకున్నారు. నల్గొండ నుంచి బేగంపేటకు చేరుకుని అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్కు వెళ్లిపోయారు. జన సమీకరణలో విఫలమైన నాయకులపై సీరియస్ అయిన సీఎం వారికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications