BELలో ఇంజినీర్ ఉద్యోగాలు : బీటెక్ పూర్తి చేశారా అయితే మంచి జీతంతో జాబ్..!!
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇంజినీరింగ్ చేసిన నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిస్తోంది. ట్రెయినీ ఇంజినీర్ మరియు ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడదుల చేసింది. కరోనా కారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చాలా సంస్థలు నిలిపివేశాయి. అయితే తిరిగి ఉద్యోగాల నియామకాలు చేపట్టాయి. ఈ క్రమంలోనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కూడా ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ పూణే డివిజన్ నుంచి తాజా ఉద్యోగ ప్రకటన వెలువడింది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ప్రకటన విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు పూణేలోని మానుఫాక్చరింగ్ విభాగంలో పనిచేస్తారు.

ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన ప్రకారం ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 3 ఉండగా ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులు 4 ఉన్నాయి. ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లు ఉండాలనే నిబంధన పెట్టగా... అదే ప్రాజెక్టు ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు ఉండాలని సూచించారు. ఇక ప్రభుత్వ పరమైన రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఎంపికైన అభ్యర్థులంతా పూణే డివిజన్లో పనిచేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు వేతనాలు కూడా బాగానే ఉన్నాయి. ట్రైనీ ఇంజినీర్కు తొలి ఏడాది రూ.25వేలు, రెండవ సంవత్సరంలో రూ.28 వేలు మూడవ సంవత్సరంలో రూ.31వేలు వేతనంగా చెల్లిస్తారు. ఇక ప్రాజెక్టు ఇంజినీర్కు తొలి ఏడాది నెలకు రూ.35 వేలు, రెండవ ఏడాది రూ.40 వేలు, మూడవ సంవత్సరంలో రూ.45వేలు, నాల్గవ ఏడాది రూ.50వేలు వేతనంగా చెల్లిస్తారు.
అభ్యర్థులు విద్యార్హతల విషయానికొస్తే నాలుగేళ్ల ఫుల్టైమ్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఇది ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ మెకానికల్ ఇంజినీరింగ్లో ఫస్ట్క్లాస్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పాస్ అయితే చాలు. ట్రైయినీ ఇంజినీర్కు ఒక ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. ప్రాజెక్టు ఇంజినీర్కు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ప్రాజెక్టు ఇంజినీర్కు జనరల్ అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ప్రాజెక్ట్ ట్రైనీకి రూ.200 ఫీజు చెల్లించాలి.ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి. అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం జరిగి ఆ తర్వాత ఆన్లైన్ వీడియో ద్వారా ఇంటర్వ్యూ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 9 సెప్టెంబర్ 2021. మరిన్ని వివరాలకు అభ్యర్థులు register.cbtexam.in వెబ్సైట్ను సందర్శించండి.
ఇంకెందుకు ఆలస్యం.. అన్ని అర్హతలు ఉండి పని అనుభవం కూడా ఉంటే ఈ ఉద్యోగం మీదే కావొచ్చు. అయితే పోస్టులు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే అయినప్పటికీ ఒప్పందం పూర్తికాగానే మళ్లీ పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి కాంట్రాక్ట్ ఉద్యోగమే కదా అని నిరుద్యోగులు అర్హతలు ఉండి కూడా అలసత్వం వహించకండి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications