JEE Main Session 2 Result 2026: జేఈఈ మెయిన్ ఫలితాలు సిద్దం- స్కోర్ కార్డు ఇలా..!
ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్ 2 బీఈ/బీటెక్ పేపర్ ఫలితాల (JEE Main Session 2 Result 2026 ) విడుదలకు రంగం సిద్దమైంది. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇవాళ స్కోర్ కార్డులు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది సుమారు 11 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాల ప్రకటన తర్వాత, విద్యార్థులు తమ స్కోర్కార్డులను అధికారిక వెబ్సైట్ - jeemain.nta.nic.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఎన్డీయే అధికారిక వెబ్ సైట్లో జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు చెక్ చేసుకోవాలంటే అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ అవసరం.
సాధారణంగా 90 కంటే ఎక్కువ పర్సంటైల్ను మంచిదిగా పరిగణిస్తారు. అయితే కేటగిరీని బట్టి, అగ్రశ్రేణి సంస్థలలో ప్రవేశానికి 93-95+ అవసరం కావచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరు కావచ్చు. తరువాత ప్రవేశాల కోసం JoSAA కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. జేఈఈ మెయిన్ పర్సంటైల్ = (మీ స్కోరు కంటే తక్కువ లేదా సమానమైన స్కోరు ఉన్న అభ్యర్థుల సంఖ్య / సెషన్లోని మొత్తం అభ్యర్థులు) x 100గా లెక్కిస్తారు. ఈ నార్మలైజేషన్ ప్రక్రియ షిఫ్టుల వారీగా కఠినత్వంలో ఉన్న తేడాలను సమతుల్యం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఈ ఫలితాలకు పునఃమూల్యాంకనం లేదా పునఃపరిశీలన ఉండదు. మాల్ ప్రాక్టీస్ చేసిన వారి ఫలితాలు ప్రకటించరు. ఎన్టీఏ స్కోరును ఫైనల్ ఆన్సర్ కీని ఉపయోగించి లెక్కిస్తారు. మార్కింగ్ స్కీమ్ ఆధారంగా ముందుగా రా మార్కులను లెక్కిస్తారు. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. తర్వాత ఈ రా స్కోర్లను నార్మలైజ్ చేసి ఎన్టీఏ స్కోరును లెక్కిస్తారు. స్కోర్కార్డ్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, మరియు కెమిస్ట్రీకి సంబంధించిన ఎన్టీఏ స్కోర్లతో పాటు, పేపర్ 1 (BE/BTech) మొత్తం స్కోరు కూడా ఉంటుంది. రెండు సెషన్లలోనూ హాజరైన అభ్యర్థులకు, ఫైనల్ మెరిట్ జాబితా, ర్యాంకింగ్ కోసం రెండు ఎన్టీఏ మొత్తం స్కోర్లలో (వ్యక్తిగత సబ్జెక్ట్ స్కోర్లు కాదు) ఉత్తమమైనదాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.














Click it and Unblock the Notifications