JEE Mains Result 2024: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 ఫలితాల విడుదల- స్కోర్ కార్డ్ చెక్ ఇలా ..!
ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షా ఫలితాలను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్ధులు ఎన్టీఏ వెబ్ సైట్ jeemain.nta.ac.in లోకి వెళ్లి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 4,5,6,8,9 తేదీల్లో జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 319 నగరాల్లో ఈ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 12న కీని విడుదల చేశారు. ఏప్రిల్ 14 వరకూ ఆభ్యంతరాలు స్వీకరించి 21న ఫైనల్ కీ ఇచ్చారు. ఇప్పుడు తుది ఫలితాలు ప్రకటించారు.

ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ పరీక్ష కోసం మొత్తం 11.79 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 10.67 లక్షల మంది పరీక్షలు రాశారు. ఇందులో అన్ రిజర్వుడ్ కేటగిరీకి (UR) 93.2362181గా నిర్ణయించారు. UR-PwD కేటగిరీకి 0.0018700, EWS కేటగిరీలో 81.3266412, ఓబీసీ కేటగిరీలో 79.6757881, ఎస్సీకి 60.0923182, ఎస్టీకి 46.6975840 కటాఫ్ గా నిర్ణయించారు.
జేఈఈ అడ్వాన్స్డ్కి సంబంధించిన క్వాలిఫైయింగ్ పర్సంటైల్ కేటగిరీల్లో ఐదేళ్ల గరిష్ట స్థాయిని తాకింది. ఈ సంవత్సరం జనరల్ కేటగిరీ కనీస కటాఫ్ 93.2, 2023లో 90.7, 2022లో 88.4. జనరల్-ఈడబ్ల్యూఎస్కి ఈ సంవత్సరం కటాఫ్ 81.3, గత సంవత్సరం 75.6, 2022లో 63.1గా ఉంది. అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించిన అర్హత శాతం 2022లో 68 నుండి 79.6కి , అలాగే 2023లో 73.6కి పెరిగింది. 2023లో 51.9 నుండి SCల శాతం 60కి చేరుకోవడంతో, ఎస్సీ, ఎస్టీ వర్గాల అర్హత స్కోర్లో భారీ పెరుగుదల నమోదైంది.












Click it and Unblock the Notifications