శుభవార్త చెప్పిన అక్కినేని ఫ్యామిలీ
అతి త్వరలోనే అక్కినేని ఇంట్లో మరో పెళ్లి జరగనుంది. అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కీలక విషయాన్ని నాగార్జున వెల్లడించారు. జైనాబ్ రవద్జీ అనే మహిళను అఖిల్ అక్కినేని సైలెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.అఖిల్ చాలాకాలం నుంచి నటి జైనాబ్ రవద్జీ ప్రేమలో ఉన్నారు.
వీరిద్దరూ తమ రిలేషన్ను పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఈక్రమంలోనే తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పడం వారు ఓకే చెప్పడం అన్నీ కూడా చక చక జరిగిపోయాయి. అటు నాగార్జున సైతం అఖిల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మార్చి24న అక్కినేని వారసుడు అఖిల్-జైనల్ల వివాహం ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి పనులను ఇరు కుటుంబ సభ్యులు చూసుకోబోతున్నారు. అయితే ఈ వేడుకకు బిజినెస్ పర్సన్స్తో పాటు సినీ సెలబ్రిటీలు, క్రికెటర్స్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అఖిల్ మొదట శ్రీయ భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించాడు. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అఖిల్తో శ్రీయ భూపాల్ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. కొన్నాళ్లు సింగిల్గా ఉన్న అఖిల్,తర్వాత జైనాబ్ రవద్జీతో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక అఖిల్ కెరీర్ విషయానికి వస్తే..అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అఖిల్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. బ్యాచ్లర్ సినిమానే యావరేజ్గా నిలిచింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. దీంతో ఈసారైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో సినిమాల నుంచి అఖిల్ కొంత గ్యాప్ తీసుకున్నాడు.
-
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications