వేణు స్వామి మరో సంచలనం ..ఎన్టీఆర్కు ఆ గండం
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న వారిలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కూడా ఒకరు. తనదైనశైలిలో సినీ, రాజకీ ప్రముఖుల జ్యోతిష్యలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. తాజాగా ఆయన మరో బాంబు పేల్చారు. జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని చెప్పి పెను సంచలనం సృష్టించారు.
ఎన్టీఆర్ జాతకం గురించి వేణు స్వామి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. గతంలో వేణు స్వామి ఎన్టీఆర్ తల్లి శాలినిను తిరుమలలో కలిశారట. అక్కడ ఎన్టీఆర్ జాతకం గురించి తల్లి శాలినితో చర్చించినట్టు ఆయన తెలిపారు. ఆ సమయంలో వేణు స్వామి చెప్పిన మాటలకు ఆమె ఆశ్చర్యపోయారట.

ఎన్టీఆర్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందనే విషయన్ని వేణు స్వామి తల్లి శాలినికి వివరించారట. అప్పటికే ఎన్టీఆర్కు ఉన్న దోషం తెలిసిన తల్లి శాలిని అంత కరెక్ట్గా కొడుకు జాతకం గురించి ఎలా చెబుతున్నారంటూ ఆశ్చర్యపోయారట. ఆ సమస్య ఏంటో నాకు తెలుసు తల్లి అని ఎన్టీఆర్కు ఉన్న పుట్టక దోషం గురించి వేణు స్వామి క్లియర్గా వివరించారట .
అయితే ఎన్టీఆర్కు ఉన్న దోషం గురించి పెద్ద ఎన్టీఆర్తో పాటు శాలినికి మాత్రమే తెలుసని.. మూడో వ్యక్తికి ఎవరికి తెలియదు.. అలాంటిది మీకు ఈ విషయం ఎలా తెలుసు అని ఆమె వేణు స్వామిని ఎన్టీఆర్ తల్లి శాలిని ప్రశ్నించిందట. నాకు అన్ని విషయాలు తెలుసంటూ వేణు స్వామి సమాధానం ఇచ్చారట. అయితే ఆ సమస్య ఏంటి అనేది మాత్రం బయట పెట్టలేదు.

జూనియర్ ఎన్టీఆర్ది మకా నక్షత్రం జయలలిత గారిది కూడా అదే నక్షత్రమని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో రావడానికి ఇంకా సమయం ఉందని.. ఖచ్చితంగా 2030 వరకు ఆయన్ను రాజకీయాల్లోకి రానివ్వకుండా వాళ్ళ అమ్మగారు అడ్డుపడుతుందని వేణు స్వామి పేర్కొన్నారు.

తాత గారికి రాజయోగం ఎలా పట్టిందో..మనవడు జూనియర్ ఎన్టీఆర్కి కూడా అలాగే రాజయోగం పడుతుంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆ జాతకంలో కచ్చింతంగా సీఎం అయ్యే యోగ్యం ఉందని.. కాని ఆయనకు దోషం ఉందని వేణు స్వామి తెలిపారు.అయితే ఆ దోషం ఏంటో చెప్పకపోవడంతో నందమూరి అభిమానులు భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications