ఓటీటీలోకి మంచు లక్ష్మి జబర్దస్త్ మూవీ.. ఇక రచ్చ రచ్చే..
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'లేచింది మహిళా లోకం'.. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఈ మూవీ ఇప్పుడు తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 22 నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కానుందీ మూవీ. ఈ మేరకు సన్ నెక్ట్స్ నుంచి తాజాగా అధికారిక ప్రకటన వెల్లడైంది. అయితే ఈ మూవీ మార్చి 26న థియేటర్లలో విడుదలైనా.. అసలు ఈ మూవీ రిలీజ్ అయినట్లు ఎవరికీ తెలియదు.. ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
మంచు లక్ష్మి లేచింది మహిళా లోకం మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకులేకపోయింది. అయితే ఏప్రిల్ 22 నుంచి ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. మరి 'లేచింది మహిళా లోకం' సినిమా ఓటీటీలో అయినా హిట్ అవుతుందా..? లేదా..? అన్నది చూడాలి. ఇక ఈ మూవీ విషయానికి వస్తే.. భార్యాభర్తల మధ్య రిలేషన్, విడాకులు, కోర్టు కేసులు, స్త్రీ పురుషుల మధ్య వివక్ష తదితర అంశాలతో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాకు కార్తిక్- అర్జున్ దర్శకత్వం వహించారు. దర్శకుడు ఈ మూవీని సెటైరికల్ గా చూపించే ప్రయత్నం చేశారు.

లేచింది మహిళా లోకం మూవీలో మంచు లక్ష్మి, అనన్య నాగళ్ల, శ్రద్ధా దాస్, హరితేజ, శ్రీరామ చంద్ర తదితరులు నటించారు. ఈ మహిళలు తమ రోజూవారీ జీవితంలో చిన్న చిన్న అవమానాలు, ఆంక్షలను ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే అప్పటి వరకూ బాధలను అనుభవించిన మహిళలు.. ఇలానే ఎందుకు ఉండాలి..? అని తిరగబడతారు. దాంతో ఈ మార్పుల కారణంగా ఇళ్లల్లోని భర్తలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కున్నారన్నదే స్టోరీ లైన్.. ఈ మూవీ ఏప్రిల్ 22 నుంచి ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది.












Click it and Unblock the Notifications