Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం రేవంత్‌ దంపతులను కలిసిన నటి రష్మిక..

విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ లోని ఉదయ్‌పూర్‌ వేదికగా ఇటీవల వీరి వివాహం సంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇక విజయ్- రష్మికల వివాహ రిసెప్షన్‌ ఈనెల 4న జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి దంపతులను జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో నటి రష్మిక మందన్న కలిశారు. వివాహ రిసెప్షన్‌ కు ఆహ్వానించారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 26న ఉదయపూర్‌ లో వీరి వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా నటి రష్మిక మందన్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులను కలిశారు. ఈ మేరకు రిసెప్షన్ కు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు హైదరాబాద్ లో మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్‌ కు రావాలని విజయ్, రష్మికలు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా ఈ జంట కలిసింది. పెళ్లి రిసెప్షన్‌ కు రావాలని అహ్వానించారు.

rashmikamandanna Meets Telangana CM Revanth Reddy amp amp Wife Geetha Warm amp amp Friendly Interaction

ఇక ఉదయ్ పూర్ లో అతి కొద్దిమంది సమక్షంలోనే పెళ్లి చేసుకున్న ఈ జంట హైదరాబాద్ లో గ్రాండ్ రెసెప్షన్ పార్టీ ఏర్పాటు చేసింది. మార్చి 04న తాజ్ హోటల్​ లో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి​ టాలీవుడ్, శాండల్​ వుడ్, బాలీవుడ్​ కు చెందిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+