ఆయన గోల్డెన్ హ్యాండ్ వల్ల ఈ స్థాయికి వచ్చా : ఆర్కే రోజా
ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా 50 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఇళయరాజాను కలిశారు. భర్త సెల్వమణి, కుమారుడు కృష్ణ కౌషిక్ తో కలిసి ఇళయరాజా ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. తన తొలి సినిమాకు ఇళయరాజానే సంగీతం అందించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఇళయరాజా గోల్డెన్ హ్యాండ్ వల్లే తాము ఇంతగా ఎదిగామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
భారతీయ సంగీత సెన్సేషన్, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీత ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా తన కుటుంబంతో కలిసి ఇళయరాజా ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేశారు. తన తొలి సినిమాకు కూడా ఇళయరాజానే సంగీతం సమకూర్చారని అలాగే ఆర్కే సెల్వమణి తొలి మూడు సినిమాలకూ సంగీతాన్ని అందించినట్లు గుర్తుచేసుకున్నారు. ఇళయరాజా గోల్డెన్ హ్యాండ్ వల్లే తాము ఇంతగా ఎదిగామని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజూ కుమారుడు కృష్ణ కౌశిక్ ను ఇళయరాజా ఆశీర్వదించారు. "మీలాగే మీ కుమారుడు కూడా సినీ రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడని.." ఆశీర్వదించారు.
ఇళయరాజాను కలిసిన ఆర్.కె.రోజా
— oneindiatelugu (@oneindiatelugu) September 15, 2025
సంగీత ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇళయరాజా. అభినందనలు తెలిపిన రోజా దంపతులు..!#RojaSelvamani #RKRoja #RKSelvamani #Ilayaraja #50YearsOfIlayaraaja #PoliticsToday #Oneindia #OITelugu pic.twitter.com/NcJEA0rn3R
ఇక ఇళయరాజా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం ఈనెల 13న నెహ్రూ స్టేడియంలో భారీ ఎత్తున గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ను నిర్వహించారు. రాయల్ అకాడమీ ఆధ్వర్యంలో లండన్ నుంచి వచ్చిన 87మంది సంగీత దర్శకులతో అతిపెద్ద సింఫోనీ కార్యక్రమంతో అఖండ సత్కారం జరిపారు.
ఈ సమావేశానికి తమిళనాడు సీఎం MK స్టాలిన్ తో బాటు, సినీ దిగ్గజాలు రజనీకాంత్, కమలహాసన్ లతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై సన్మానించారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా దర్శక దిగ్గజం ఆర్కే సెల్వమణి హాజరయ్యారు. తాను దర్శకత్వం వహించిన తొలి మూడు చిత్రాలకూ ఇళయరాజా గారే సంగీతం సమకూర్చారని, ఆ మూడూ సూపర్ హిట్ అయ్యిందని అన్నారు.

ఇళయరాజా సినీ సంగీత ప్రపంచంలో 50ఏండ్లుగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటివరకూ 1,500 పైగా సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, 8,500 పైగా పాటలకు సంగీతాన్ని అందించారు. సినిమా సంగీతంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఈ దిగ్గజానికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.
1943లో తమిళనాడులోని పన్నైపురంలో ఇళయరాజా జన్మించారు. ఆయన అసలు పేరు జ్ఞానదేశికన్. బాల్యంలోనే జానపద గీతాలు, గ్రామీణ నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. అలా 1976లో అన్నకిళి అనే సినిమాతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశారు. రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో సింఫనీ రికార్డ్ చేసిన తొలి ఆసియా సంగీత దర్శకుడు ఇళయరాజా కావడం విశేషం. ఇళయరాజా ఇప్పటివరకు 5 జాతీయ అవార్డులు అందుకున్నారు. 2010లో పద్మ భూషణ్, 2018లో పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కించుకున్నారు.
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది












Click it and Unblock the Notifications