ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్ ...చాలా అతనితో క్లోజ్గా
బాలీవుడ్ హీరోయిన్లు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే కియారా అద్వానీ, పరిణీతి చోప్రా, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లు పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నట్టే కనిపిస్తోంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు శ్రద్ధా కపూర్. ఆషికి 2 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ భామ తెలుగులో కూడా నటించింది. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కేవలం బాలీవుడ్ సినిమాల్లోనే నటిస్తోంది.
ఇక అమ్మడుకు ఎఫైర్లు కూడా తక్కువేం కాదు. గతంలో ఆదిత్యరాయ్ కపూర్తో శ్రద్ధా కపూర్ రిలేషన్లో ఉందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత తన చిన్ననాటి మిత్రుడుని శ్రద్ధా కపూర్ ప్రేమిస్తోందని, అతన్నే వివాహం చేసుకుంటుందనుకున్నారు. ఈ రిలేషన్ కూడా పెళ్లి వరకు వెళ్లలేదు. ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యార్తో శ్రద్ధా కపూర్ డేటింగ్ చేస్తోందనే రూమర్లు వినిపించాయి. తాజాగా శ్రద్ధా కపూర్ రచయిత రాహుల్ మోడీతో రిలేషన్షిప్లో ఉందనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ వార్తలకు బలం చేకూరుస్తు అమ్మడు షాకింగ్ పోస్ట్ షేర్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా.. రాహుల్ మోడీతో కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ '' మనసు నీ దగ్గరే ఉంచుకో. కానీ నా నిద్రను మాత్రం తిరిగి ఇచ్చేయ్'' అనే క్యాప్షన్ను జత చేసింది. అంతేకాకుండా రాహుల్ మోడీని ట్యాగ్ చేసింది. దీంతో శ్రద్ధా కపూర్ రాహుల్ మోడీతో రిలేషన్లో ఉందని అంతా భావిస్తున్నారు. తాము రిలేషన్షిప్లో ఉన్నామని ఈ పోస్ట్తో శ్రద్ధా కపూర్ కన్ఫార్మ్ చేసినట్టు అయింది. శ్రద్ధా కపూర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరిఈ రిలేషన్ అయిన శ్రద్ధా పెళ్లి వరకు తీసుకువెళ్తుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications