పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్!
కన్నడ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమా 'టాక్సిక్' గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో యష్, హీరోయిన్ కియారా అద్వానీ మధ్య ఉండబోయే ఓ బోల్డ్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సాధారణంగా భారతీయ సినిమాల్లో కనిపించే విధంగా కాకుండా.. చాలా భిన్నంగా, సాహసోపేతంగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
చిత్ర బృందంలో భిన్నాభిప్రాయాలు
ఈ సన్నివేశం కేవలం గ్లామర్ పరంగానే కాకుండా.. దాని మేకింగ్ స్టైల్ పరంగా కూడా చాలా కొత్త ఉండబోతోందని సమాచారం. అయితే ఈ సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా వివాదాలకు దారితీస్తుందా అనే విషయంలో చిత్ర బృందంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది టీమ్ సభ్యులు ఈ సన్నివేశం సినిమాకు ఓ ప్రత్యేక గుర్తింపును తెస్తుందని.. నేటి పోటీ ప్రపంచంలో ఇలాంటి మూమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతాయని భావిస్తున్నారు.

వెనకడుగు వేసిన హీరోయిన్
మరోవైపు ఈ సీన్ కారణంగా సినిమా కథ, నటీనటుల నటన కంటే కూడా వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందేమోనని మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్ కియారా అద్వానీ ఈ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తను సంపాదించుకున్న క్లీన్ ఇమేజ్కు ఈ సీన్ భంగం కలిగిస్తుందేమోనని.. అందుకే ఆ సన్నివేశాన్ని తొలగించడమో లేదా దాని తీవ్రతను తగ్గించడమో చేయాలని ఆమె మేకర్స్ను కోరుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ సాహసోపేతమైన రిస్క్ తీసుకుంటే సినిమాకు హైప్ పెరుగుతుందా లేక అనవసర ఇబ్బందులు వస్తాయా అని వారు ఆలోచిస్తున్నారు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాలోని ఆ సీన్ ఇండియన్ సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications