Fact Check: నాగ్ పూర్-ముంబై రైలు మాయం ? రైల్వేశాఖ క్లారిటీ ఇదే..!
మహారాష్ట్ర లోని నాగ్ పూర్ నుంచి ముంబై వెళ్తున్న గూడ్స్ రైలు ఒకటి మాయమైనట్లు వస్తున్న వార్తలపై సెంట్రల్ రైల్వే ఇవాళ స్పష్టత ఇచ్చింది.
మహారాష్ట్రలో సెంట్రల్ రైల్వే పరిధిలోకి వచ్చే నాగ్ పూర్-ముంబై స్టేషన్ల మధ్య 90 కంటెయినర్లతో బయలుదేరిన గూడ్స్ రైలు సినీ ఫక్కీలో మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. నాగ్ పూర్ నుంచి కంటెయినర్లతో ముంబైకి బయలుదేరిన ఈ రైలును మధ్యలో కొందరు మాయం చేసినట్లు వార్తలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై సెంట్రల్ రైల్వే ఇవాళ క్లారిటీ ఇచ్చింది.

నాగ్ పూర్-ముంబై రైలు మిస్సింగ్ అంటూ పలు పత్రికల్లో, ఆన్ లైన్లో కథనాలు రావడంతో దీనిపై ఇవాళ సెంట్రల్ రైల్వే అధికారులు ఓ ప్రకటన విడుదల చేస్తూ ట్వీట్ చేశారు. ఇందులో రైలు మిస్సింగ్ కథనాల్ని వారు తీవ్రంగా ఖండించారు. అసలేం జరిగిందో అధికారులు వెల్లడించారు. ఈ రైలు నాగ్ పూర్ లోని మిహాన్ లో ఉన్న ఇన్ ల్యాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ) నుంచి ఫిబ్రవరి 1న బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ఇది భూసవాల్ డివిజన్ లోని షెగాన్ స్టేషన్ కు ఫిబ్రవరి 5న చేరుకుందన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో జేఎన్పీటీ పోర్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అంతే కానీ ఈ రైలు ఎక్కడికీ మిస్ కాలేదన్నారు.

అంటే వాస్తవానికి రైలు మార్గంలో ఇంత భారీ కంటెయినర్లను జేఎన్పీటీ పోర్టుకు తరలించే అవకాశం లేకపోవడంతో నాగ్ పూర్ నుంచి షెగాన్ స్టేషన్ వరకూ తెచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పోర్టుకు తరలించినట్లు అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం తెలియకుండా రైలు ముంబైకి రాలేదని, కాబట్టి మిస్సయినట్లు ప్రచారం జరుగుతోందని సెంట్రల్ రైల్వే క్లారిటీ ఇచ్చింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
𝗙𝗔𝗖𝗧 𝗖𝗛𝗘𝗖𝗞
— Central Railway (@Central_Railway) February 14, 2023
The news in circulation about the missing of rake carrying containers from Nagpur to Mumbai is 𝗳𝗮𝗰𝘁𝘂𝗮𝗹𝗹𝘆 𝗶𝗻𝗰𝗼𝗿𝗿𝗲𝗰𝘁. The clarification issued may please be carried for the correct information of readers. @RailMinIndia pic.twitter.com/nVIY1proWV

Fact Check
వాదన
నాగ్ పూర్ నుంచి ముంబై వెళ్తున్న 90 కంటెయినర్ల గూడ్స్ రైలు మధ్యలో మిస్సింగ్
వాస్తవం
నాగ్ పూర్ నుంచి బయలుదేరిన రైలు మధ్యలో రోడ్డు మార్గంలో పోర్టుకు కంటెయినర్లు తీసుకెళ్లిందని సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
రేటింగ్
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications