1998- 2003 కాంగ్రెస్
చిన్నారెడ్డిలాంటి వారు పలు సందర్భాల్లో రాజశేఖర్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. పాదయాత్ర సందర్భంగా రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించిన సందర్భాలను టిసిఎఫ్ నేతలు వేలెత్తి చూపించారు. ఈ స్థితిలో తమ పార్టీలోని అతివాద తెలంగాణవాదులను దారికి తెచ్చుకోలేమని రాజశేఖర్ రెడ్డి పసిగట్టే ఉంటారు. ఈ స్థితిలో చిన్నారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సారయ్య, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చివరి అస్త్రం ప్రయోగించేదాకా వేచి చూశారు. మిగతా వారిని వారి దారి పట్టకుండా నిరోధించగలిగారు. వీరి నలుగురి తిరుగుబాటు వల్ల నష్టపోయేదేమీ లేదని కూడా రాజశేఖర్ రెడ్డి నిరూపించదలుచుకున్నారు.
అలా చేస్తూనే అతివాదులపై మితవాదులు, తన వర్గం తెలంగాణ నాయకులు పైచేయి సాధించే వ్యూహాన్ని అమలు పరుస్తున్నారు. ఇందులో భాగంగానే మళ్లీ ఈ ఏడాది నవంబర్ 1వ తేదీన అదే దామోదర్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ సదస్సు జరగబోతోంది. ముందు చంద్రబాబును ఓడించే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. అంటే తెలంగాణ నినాదం వారికి అంత ప్రాధాన్యం కాదని అర్థమైపోతోంది. రాజకీయాస్త్రంగా, అంతర్గత శత్రువులను దెబ్బ తీసేందుకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నారనేది స్పష్టమవుతూనే ఉన్నది.
ఇప్పుడు చిన్నారెడ్డి, ప్రభృతులు ఏం చేయాలనే విషయం కచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. నిజంగానే తమకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నదని నిరూపించుకోవడానికి వారు ముందుకు పోవడం తప్ప మార్గాంతరం లేదు.