మలిదశలో టిఆర్ఎస్
హాస్టళ్ల వ్యవహారంపై పోలీసుల నుంచి అందిన సూచనలతో ఈ హాస్టళ్ల ఖర్చును కూడా అదుపుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్ల అక్రమ సంపాదనకు కళ్లెం వేయాలని అదే సమయంలో హాస్టల్లో వుండే విద్యార్ధుల క్రమశిక్షణతో చదువు తప్ప మరో వ్యాపకం జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టి, బిసి సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ప్రభుత్వం ఏటా కనీసం 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని అంచనా ఈ మొత్తంలో కనీసం 25 శాతం దుర్వినియోగం అవుతున్నదని అధికారులు భావిస్తున్నారు. విద్యార్ధుల సంఖ్యను తప్పుగా చూపి అవసరమైన దానికంటే నిత్యావసరాలు ఎక్కువమొత్తంలో తీసుకుని మిగిలిన వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయించడం వార్డెన్లకు మామూలేనని ఎసిబి వంటి సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు అందజేసినట్టుగా చెబుతున్నారు. విద్యార్ధుల వేలిముద్రలను గుర్తించే బయోమెట్రిక్ యంత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల హాస్టళ్లలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.