వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తారలను భాను ట్రాప్ చేశాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ తెలుగు సినీ తారలను ట్రాప్ చేయడానికి ప్రయత్నించాడనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తెలుగు సినిమా హీరోయిన్లను తన వైపు లాక్కోవడానికి అతను ప్రయత్నించినట్లు సమాచారం. అతని ల్యాప్‌టాప్‌లో కొంత మంది వర్ధమాన తారల నగ్న చిత్రాలు ఉన్నట్లు పోలీసులు కనిపెట్టినట్లు చెబుతున్నారు. సినీ రంగాన్ని ఏలాలని అతను తీవ్రంగా ప్రయత్నించాడని అంటున్నారు. కొంత మంది సినీ నిర్మాతలతో అతను సంబంధాలు పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మద్దెలచెర్వు సూరిని పక్కన పెట్టి భాను స్వయంగా తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవపడానికి చాలా దందాలు నడిపినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మాత సి. కళ్యాణ్‌ను హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సిసిఎస్) పోలీసులు గురువారం రెండు సార్లు ప్రశ్నంచారు.

సింగనమల రమేష్‌ను కూడా పోలీసులు ప్రశ్నంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రమేష్ అనతి కాలంలోనే భారీ నిర్మాతగా ఎదగాడని అంటున్నారు. భారీ పెట్టుబడులతో నిర్మించిన ఖలేజా, కొమురం పులి సినిమాలకు అతను నిర్మాత. ఈ రెండు సినిమాలకు దాదాపు 80 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్లు చెబుతున్నారు. ఇదంతా భాను చీకటి సామ్రాజ్యం వల్లనే సాధ్యమైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ ఎంతగా కొట్టిపారేసినప్పటికీ భానుతో అతనికి గల సంబంధాలపై మీడియా కథనాలు ఆగిపోవడం లేదు. సింగనమల రమేష్‌పై కూడా అలాంటి కథనాలే ప్రసారమవుతున్నాయి.

దాదాపు 150 చిత్రాలు నిర్మాణవుతుంటే కేవలం 25- 30 మంది నిర్మాతలే ఉండడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఐదుగురు నిర్మాతలు సినీ రంగాన్ని శాసిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఈ బడా నిర్మాతలు కోట్లాది రూపాయల పెట్టుబడులతో సినిమాలు నిర్మిస్తూ మిగతా నిర్మాతలను తొక్కిపారేస్తున్నారనే విమర్శలు చాలా కాలంగానే వినిపిస్తున్నాయి. ఓ వైపు షూటింగులు ఆపేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించగా సంక్రాంతికి ఇన్ని సినిమాలు విడుదల కావడం వెనక మతలబు ఏమిటనే ప్రశ్న కూడా వస్తోంది. ఇదంతా వారి వెనక గల డబ్బు పలుకుబడి అంటున్నారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనేదే ప్రశ్నార్థకంగా మారింది. అందువల్లనే కొద్ది మంది నిర్మాతలకు భాను కిరణ్ ముఠాతో గల సంబంధాలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. బాలీవుడ్‌లో లాగానే టాలీవుడ్‌లోనూ మాఫియా ప్రవేశించిందనే ప్రచారం ఊపందుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X