ప్రపంచ రికార్డ్ దిశగా వందేళ్ల జాతీయ గీతం
ఇందుకోసం ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు హాజరయ్యారు. కాగా రవీంద్రుడు ఈ జనగణమనను చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో రాశారు. బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని రాసింది కూడా రవీంద్రుడే. జనగణమనను మన భారత రాజ్యాంగం 1950 జనవరి 24న జాతీయ గీతంగా స్వీకరించింది. ఆయన మొదటిసారి బెంగాళీలో ఈ గీతాన్ని ఆలపించారు. ఈ గీతానికి బాణీలు కట్టింది కూడా విశ్వకవే. ఆ తర్వాత ఇంగ్లీషులోకి అనువదించారు.
భారత జాతీయ గీతం జనగణమనను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గీతంగా యునెస్కో గుర్తించింది. ఎన్నో ప్రశంసలు పొందిన ఈ గీతంపై వివాదాలు కూడా లేకపోలేదు. ఇందులోని సింధు పదాన్ని తొలగించాలని కొందరు కోర్టుకెక్కగా దానిని కోర్టు తిరస్కరించింది. అలాగే తెల్లదొరలను ఈ గీతం రాశారనే వివాదం కూడా ఉంది. తెల్లదొరలను కీర్తిస్తూ రాసిన గీతం కాబట్టి దానిని ఎలా ఆమోదించాలని ప్రశ్నించే వారూ ఉన్నారు. అంతేకాకుండా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకే రవీంద్రుడు ఈ గీతాన్ని రాశారని, ఆయన స్వతహాగా రాయలేదని అంతేకాకుండా గీతానికి బాణీలు కట్టింది తానేనని నేతాజీ అనుచరుడు ఒకరు తెరపైకి వచ్చారు.