నీలం తర్వాత మహాసేన్: తుఫాన్లకి ఆ పేర్లెందుకు?
మన దేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను, శ్రీలంకను ఇటీవల నీలం తుఫాను ఓ కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు వచ్చిన ఈ తుఫానుకు నీలం అని పాకిస్తాన్ పేరు పెట్టింది. హిందూ మహా సముద్రాన్ని ఆనుకొని ఉన్న ఎనిమిది దేశాలు తుఫాన్లకు పేర్లు పెడుతుంటాయి.

భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఓమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయ్లాండులు వరుసగా తుఫాన్లకు పేర్లు పెడుతుంటాయి. ఇందులో భాగంగా ఈసారి తమిళనాడు, ఎపి, శ్రీలంకలను కుదేపిసిన సైక్లోన్కు పాకిస్తాన్ పేరు పెట్టింది. తుపాన్లకు పేర్లు పెట్టడం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది.
అయితే హిందూమహా సముద్రంలో వచ్చే తుఫాన్లకు పేర్లు పెట్టేందుకు ఒక విధానాన్ని ఆయా దేశాలు 2004లో రూపొందించాయి. ఈ విధానమే ప్రస్తుతం అమలులో ఉంది. నీలం తుఫాను కుదిపేయగా.. భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకు కూడా ఆయా దేశాలు పేర్లు నిర్ణయించాయి.
తర్వాత వచ్చే తుఫానుకు శ్రీలంక మహాసేన్ అని పేరు పెట్టగా, ఆ తర్వాత దానికి థాయ్లాండ్ పైలిన్ అని పేరు పెట్టింది. భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకు మన దేశం తరఫున కూడా అప్పుడే పలు పేర్లు క్యూలో ఉన్నాయి. లెహర్, మేఘ్, సాగర్, వాయులు ఉన్నాయి.
అలాగే పాకిస్తాన్ పెట్టిన పేర్లలో నీలోఫర్, టిట్లి, బుల్ బుల్ ఉన్నాయి. నీలం తుఫాన్ కంటే ముందు వచ్చిన తుఫాన్కు ముర్జాన్ అని ఓమన్ దేశం పెట్టింది. 2004 నుండి వచ్చిన పలు సైక్లోన్లకు మన దేశం పెట్టిన పేర్లు... అగ్ని, ఆకాశ్, బిజ్లి, జల్ ఇలా ఉన్నాయి. వచ్చే తుఫానుకు శ్రీలంక మహాసేన్గా నామకరణం చేసింది.
సైక్లోన్లకు పేర్లు ఎందుకు?
సైక్లోన్లకు నీలమ్, అగ్ని, ఆకాశ్ అని ఇలా పేర్లు ఎందుకు పెడతారనే ప్రశ్న పలువురిలో ఉదయించవచ్చు. సైక్లోన్కు టెక్నికల్ కోడ్నో లేక ఓ నెంబర్నో ఇవ్వడం కంటే ఇలా ప్రజల్లోకి వెళ్లే పేర్లు పెట్టడం వీజీ. తుఫాన్ అనేది బీభత్సాన్ని సృష్టిస్తుంది. అందుకే ప్రజల్లోకి వీజీగా వెళ్లే పేరు పెడితే వారిని అప్రమత్తం చేసేందుకు వీలుగా ఉంటుంది.
అలాగే ఇలా పేర్లు పెట్టడం వల్ల ఒక పర్యాయం వచ్చిన తుఫాను గురించి తెలుసుకునేందుకు ఆ పేరుతో పరిశీలిస్తే దాని వల్ల వచ్చిన లాభనష్టాల గురించి కూడా సులభంగా తెలుసుకోవచ్చ. నెంబర్ ఇవ్వడమో టెక్నికల్ కోడ్ ఇవ్వడమో చేస్తే సులభంగా ఉండదు. ఈ పేర్లు పెట్టడం కూడా ప్రపంచ వాతావరణ సంస్థ నియమావళికి లోబడే ఉంటుంది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications