పైనల్: ఫ్యాన్స్ మద్దతు కివీస్కే, ఆసక్తిగా (ఫోటోలు)
మెల్బోర్న్: మార్చి 29 అంతర్జాతీయ క్రికెట్లో క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని రోజు. కారణం ఆస్టేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్ జరుగుతుండటమే. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్లో సెమీ పైనల్ వరకు టీమిండియా తన అభిమానులు అలరించింది. ఆస్టేలియా చేతిలో సెమీ పైనల్ మ్యాచ్లో ఓటమిపాలవ్వడంతో భారత్ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
ప్రపంచ కప్ లో టీమిండియా పోరాటం ముగిసింది. ఉపఖండం జట్లు శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు క్వార్టర్స్ లోనే వెనుదిరిగాయి. టైటిల్ రేసులో ఆతిథ్య ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు మిగిలాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానుల మద్దతు ఎవరికి? ఆదివారం ఆసీస్, కివీస్ ల మధ్య జరిగే ఫైనల్లో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు?
దాదాపు 95 శాతం మంది అభిమానులు న్యూజిలాండ్ కు మద్దతు పలకడం విశేషం. ఇప్పుడు టీమిండియా అభిమానులంతా ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆతిథ్య దేశాలైన ఆస్టేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్కి మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
ఆదివారం జరిగే గ్రాండ్ పైనల్లో ఆస్టేలియా-న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఆస్టేలియా ఐదవసారి పైనల్లో ఆడుతుండగా, న్యూజిలాండ్ తొలిసారి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్లోని మహ్మాద్ క్యాప్ మార్ట్ బొమ్మలకు న్యూజిలాండ్-ఆస్టేలియా దుస్తులు వేసి ప్రదర్శనకు ఉంచారు. బొమ్మలను నగరంలోని ప్రజలు చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

వరల్డ్కప్ పైనల్: ఫ్యాన్స్ మద్దతు కివీస్కే, ఆసక్తిగా
వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్లోని మహ్మాద్ క్యాప్ మార్ట్ బొమ్మలకు న్యూజిలాండ్-ఆస్టేలియా దుస్తులు వేసి ప్రదర్శనకు ఉంచారు. బొమ్మలను నగరంలోని ప్రజలు చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

వరల్డ్కప్ పైనల్: ఫ్యాన్స్ మద్దతు కివీస్కే, ఆసక్తిగా
ఇక మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ కోసం ఆసీస్, కివీస్ జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఫైనల్కు చేరుకున్న రెండు జట్లు కప్ మాదంటే మాదంటున్నాయి.
వరల్డ్కప్ పైనల్: ఫ్యాన్స్ మద్దతు కివీస్కే, ఆసక్తిగా
తొలిసారి పైనల్కు చేరిన న్యూజిలాండ్ తొలిసారి వరల్డ్ కప్ను ముద్దాడాలి ఎదురుచూస్తోంది. ఇప్పటికే నాలుగు వరల్డ్ కప్లను సాధించిన ఆసీస్ తమ ఖాతాలో మరో వరల్డ్ కప్ను సాధించాలనే పట్టుదలతో ఉంది.
వరల్డ్కప్ పైనల్: ఫ్యాన్స్ మద్దతు కివీస్కే, ఆసక్తిగా
రెండు జట్లు కూడా ఎవరికి వారు విజేతలం అంటూ ప్రకటించుకున్నారు. ప్రపంచంలో ఉన్న మైదానాల్లో పెద్ద మైదానాల్లో మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఒకటి. ఈ గ్రౌండ్ లో కివీస్ విజయం బాగాలేదు కాబట్టి విజయం తమదేనని ఆసీస్ పేర్కొంటోంది.
వరల్డ్కప్ పైనల్: ఫ్యాన్స్ మద్దతు కివీస్కే, ఆసక్తిగా
రెండు అగ్రశ్రేణి జట్లు, వరల్డ్ కపై ఫైనల్లో పోటీ పడతుండటంతో ఈ మ్యాచ్పై అభిమానుల అంచనాలు పెరిగాయి. ఆసీస్ను చిత్తు చేసి తొలి సారి వరల్డ్ కప్ను సాధిస్తామని కివీస్ ఆటగాళ్లు తెలిపారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications