ఉపాసన పెట్టుబడికి.. రామ్చరణ్ ప్రచారం(పిక్చర్స్)
హైదరాబాద్: వచ్చే మూడేళ్లలో 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెచ్యూర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ వోలనో ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అద్నాన్ అదీబ్ చెప్పారు. తమ సంస్థ ప్రచారానికి ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నామని తెలిపారు.
కాగా, వోలనో ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాల విస్తరణకు వచ్చే 6-9 నెలల్లో దాదాపు రూ.36 కోట్లు సమీకరించనుంది. ఈ కంపెనీలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్నకు చెందిన లైఫ్టైమ్ వెల్నెస్ ఆర్ఎక్స్ ఇంటర్నేషనల్, అడ్వెంచర్ ట్రైయిల్స్ ఇండియా పెట్టుబడులు పెట్టాయి. లైఫ్టైమ్ వెల్నెస్కు హీరో రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కామినేని మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో వోలనో ఎంటర్టైన్మెంట్ నిర్వహించే అమెచ్యుర్ క్రీడలకు రామ్ చరణ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. అవరోధాలను అధిగమిస్తూ.. పరుగులు తీయడం వంటి క్రీడలు వ్యక్తుల్లో సామర్థ్యాలను పెంచుతాయని.. వ్యక్తిగతంగా తనకు ఇటువంటి క్రీడలంటే ఇష్టమని కంపెనీ ప్రచార కర్త రామ్చరణ్ ఈ సందర్భంగా చెప్పారు. శరీర దారుఢ్యాన్ని కోరుకునే వ్యక్తులకు ఈ క్రీడలు చక్కగా దోహదం చేయగలవని తెలిపారు.
మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి
దేశంలో అతిపెద్ద అమెచ్యుర్ స్పోర్ట్స్ కంపెనీగా ఎదగడమే తమ లక్ష్యమని వోలనో ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు, ఎండీ ఎ అదీబ్ తెలిపారు. కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచే కొత్త, కొత్త క్రీడలపై ఆసక్తి పెరుగుతోందని.. ఇది తమ కంపెనీ వృద్ధికి దోహదం చేయగలదని చెప్పారు.
మూడేళ్లలో రూ.100 కోట్ల టర్నోవర్ను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకూ ఆరు పరుగు క్రీడలను నిర్వహించిన కంపెనీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వచ్చే మూడేళ్లలో 34 ఈవెంట్లను నిర్వహించాలని భావిస్తోంది. క్రీడల్లో పాల్గొనే వారి నుంచి కంపెనీ రూ.1,500-3,000 వరకూ వసూలు చేస్తుంది. స్పాన్సర్ షిప్ల ద్వారా కూడా కంపెనీకి ఆదాయం లభిస్తుంది.

రామ్ చరణ్
వచ్చే మూడేళ్లలో 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమెచ్యూర్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ సంస్థ వోలనో ఎంటర్టైన్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అద్నాన్ అదీబ్ చెప్పారు.

రామ్ చరణ్
తమ సంస్థ ప్రచారానికి ప్రముఖ టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తేజ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నామని తెలిపారు.

రామ్ చరణ్
కాగా, వోలనో ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాల విస్తరణకు వచ్చే 6-9 నెలల్లో దాదాపు రూ.36 కోట్లు సమీకరించనుంది.

రామ్ చరణ్
ఈ కంపెనీలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్నకు చెందిన లైఫ్టైమ్ వెల్నెస్ ఆర్ఎక్స్ ఇంటర్నేషనల్, అడ్వెంచర్ ట్రైయిల్స్ ఇండియా పెట్టుబడులు పెట్టాయి.

రామ్ చరణ్
లైఫ్టైమ్ వెల్నెస్కు హీరో రామ్ చరణ్ తేజ్ సతీమణి ఉపాసన కామినేని మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారు.

రామ్ చరణ్
ఈ నేపథ్యంలో వోలనో ఎంటర్టైన్మెంట్ నిర్వహించే అమెచ్యుర్ క్రీడలకు రామ్ చరణ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తారు.

రామ్ చరణ్
దేశంలో అతిపెద్ద అమెచ్యుర్ స్పోర్ట్స్ కంపెనీగా ఎదగడమే తమ లక్ష్యమని వోలనో ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు, ఎండీ ఎ అదీబ్ తెలిపారు.

రామ్ చరణ్
కార్పొరేట్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచే కొత్త, కొత్త క్రీడలపై ఆసక్తి పెరుగుతోందని.. ఇది తమ కంపెనీ వృద్ధికి దోహదం చేయగలదని చెప్పారు.

రామ్ చరణ్
అవరోధాలను అధిగమిస్తూ.. పరుగులు తీయడం వంటి క్రీడలు వ్యక్తుల్లో సామర్థ్యాలను పెంచుతాయని.. వ్యక్తిగతంగా తనకు ఇటువంటి క్రీడలంటే ఇష్టమని కంపెనీ ప్రచార కర్త రామ్చరణ్ ఈ సందర్భంగా చెప్పారు.












Click it and Unblock the Notifications