హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపిలో హరికృష్ణ మళ్లీ యాక్టివ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Harikrishna
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ ఎన్టీ రామారావు కుమారుడు నందమూరి హరికృష్ణ మళ్లీ తెలుగుదేశం పార్టీలో చురుకైన పాత్ర నిర్వహించబోతున్నారు. చాలా కాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన పాలు పంచుకోలేదు. సోదరుడు బాలకృష్ణ, కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. కానీ హరికృష్ణ అంతటి కీలకమైన సమయంలో కూడా దూరంగా ఉన్నారు. అనారోగ్యం కారణంతో పార్టీ వ్యవహారాలకు ఇంత కాలం దూరంగా ఉన్నారు.

అకస్తాత్తుగా హరికృష్ణ మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కలిశారు. ఆయన వెంట కుమారుడు కళ్యాణ్ రామ్ ఉన్నారు. వరద బాధితుల కోసం హరికృష్ణ తన రెండు నెలల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా 20 లక్షల రూపాయలను తన ఎంపిల్యాడ్స్ నుంచి ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున వాటిని వరద బాధితులకు విరాళంగా ప్రకటించారు. దీంతో ఆయన పార్టీలో మరోసారి క్రియాశీలకంగా పాల్గొనేందుకు ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు.పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ హరికృష్ణను పార్టీ పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు.

కాగా, ప్రభుత్వంపై విమర్శలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పదును పెట్టడం ప్రారంభించారు. ముఖ్యమంత్రి కుర్చీ కింద పాము చేరినా గుర్తించలేనంత స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందని ఆయన అన్నారు. మరో ముఖ్యమంత్రి కూడా పాము కాటుకు బలై వుంటే పరిస్థితేమిటని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X