వైయస్ షాక్ మృతులకూ చెక్

YS Rajasekhar Reddy
వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతితో షాక్ కు గురై మరణించినవారెంత మంది, సహజమరణాలెన్ని అనే విషయాలపై మరోసారి వివాదం చెలరేగుతోంది. లెక్కల చిక్కుముడి విప్పడం సామాన్యుడి తరం కావడం లేదు. జగన్ లెక్కలు ఒక రకంగానూ కాంగ్రెసు పార్టీ అధిష్టానం లెక్కలు మరో రకంగానూ ఉన్నాయి. అంచనాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. వైయస్ మృతిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారితో పాటు ఆవేదనతో గుండె పగిలి మరణించినట్లు చెబుతున్న వారి కుటుంబాలకూ పరిహారం ఇచ్చేందుకు జగన్ సిద్ధపడ్డారు. కానీ అధిష్ఠానం మాత్రం వైయస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయినట్టుగా పోలీసు రికార్డుల్లో నమోదైన వారికే పరిహారాన్ని వర్తింప చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోందని ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. జగన్ లెక్క ప్రకారం..ఓదార్పు పొందాల్సిన వారి సంఖ్య 600 వరకూ ఉండగా, అధిష్ఠానం లెక్క ప్రకారం ఇది రెండంకెలకు దాటే అవకాశం లేదు. ఎఫ్ఐఆర్ కాపీలనే ప్రాతిపదికగా తీసుకుంటే ఓదార్పు పొందే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆన్‌ లైన్ పరిశీలనలోనూ తేలింది.

తూర్పుగోదావరి జిల్లాను ఆ దినపత్రిక ఉదాహరణగా తీసుకుని తేడాను విశ్లేషించింది. ఈ జిల్లాలో ఒక వ్యక్తి ఉరేసుకుని చనిపోయినా ఎఫ్ ఐఆర్ నమోదు కాలేదు. కానీ ఆ జిల్లాలో 74 కుటుంబాలను జగన్ ఓదార్చి, ఆర్థిక సాయం అందజేశారు. దీని ప్రకారం ఏఐసీసీ ఆధ్వర్యంలో పరిహారంఅందుకునే కుటుంబం ఒక్కటి కూడా లేదన్నమాట. జగన్ ఓదార్పు యాత్ర చేపట్టనున్న ప్రకాశం జిల్లాలో వైయస్ మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి సంఖ్య ఆయన లెక్క ప్రకారం 40. కానీ ఆ జిల్లాలో ఎఫ్ ఐఆర్ ‌లు నమోదైనది కేవలం ఏడు మరణాలకే. అంటే పార్టీ మార్గదర్శకాల ప్రకారం ఆర్థిక సహాయం అందేది ఆ ఏడు కుటుంబాల వారికే. అన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా ఉంటుందనేది వార్తాకథనం సారాంశం.

గుంటూరు జిల్లాలో 48 మంది మరణించినట్టు జగన్ వర్గం నిర్ధారించగా, వీటిలో గుండెపోటు వంటి సహజ మరణాలే ఎక్కువగా ఉన్నాయి. పురుగుల మందు తాగి, ఉరివేసుకుని చనిపోయిన వారి సంఖ్య ఏడు. పోలీసు రికార్డుల్లో ఐదు మరణాలే నమోదయ్యాయి. నిజామాబాద్‌ లో ఒకరు మాత్రమే గుండెపోటుతో మరణించారు. వరంగల్ జిల్లాలో ఒక వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లాలో 29 మంది చనిపోయారని జగన్ వర్గం పేర్కొంటుండగా, ఇద్దరు పురుగుల మందు తాగి మృతిచెందినట్టు కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఒక యువకుడు ఉరిపోసుకున్నాడు.పశ్చిమ గోదావరి జిల్లాలో 42 మందిని ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ పరామర్శించగా, తొమ్మిది మరణాలు మాత్రమే పోలీసు రికార్డుల్లోకి ఎక్కినట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో 14 మందిని పరామర్శించగా, ఒక్క మృతి కూడా రికార్డుల్లోకి ఎక్కలేదని సమాచారం.

ఆదిలాబాద్ జిల్లాలో 11 మంది మరణించినట్టు చెబుతుండగా, రెండు కేసులలోనే ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడగా, ఒక్క కేసులో మాత్రమే ఎఫ్ ఐఆర్ దాఖలయింది. కడప జిల్లాలో 20 మంది మృతి చెందినట్టు పేర్కొంటుండగా, ఒక యువతి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు కేసు నమోదయింది. విశాఖపట్నం జిల్లాలో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఎఫ్ ఐఆర్ దాఖలైంది. ఎఐసిసి లెక్కల తీరుపై జగన్ వర్గం ప్రశ్నలు సంధిస్తోంది. టీవీ చూస్తూ గుండె ఆగి మరణించినవారిని పరిగణనలోకి తీసుకోలేదని మాట్లాడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+