జగన్ ఫీవర్ తో ఢిల్లీ చుట్టూ సిఎం చక్కెర్లు

ఆయన మంత్రివర్గ కూర్పు కోసం ఢిల్లీలోనే మూడు రోజులు తిష్ట వేయటం, సభాపతి, ఉపసభాపతి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలో ఆయన జగన్ వైపు చూడటమే కాకుండా, ప్రాంతీయ, సామాజిక విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇన్ని సమస్యల కారణంగా అయన తరుచూ ఢిల్లీ వెళ్లి అధిష్టానం గడ్డం పట్టుకుంటున్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ, జగన్ సమస్యలు తీర్చలేడనే భావనతోనే కిరణ్ ను ముఖ్యమంత్రిగా చేస్తే ఆయన సైతం తన బొప్పిని అధిష్టానం ముందుకు తరుచూ తీసుకు పోతున్నాడు.
బాధ్యతలు స్వీకరించిన పక్షం రోజులలోనే తరుచూ ఢిల్లీ పర్యటనంటున్నారు. శనివారం శాసనసభ సమావేశాల అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి వచ్చారు. ఆయన స్వంతగా రచన చేసిన మంత్రివర్గ విస్తరణ వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వ్యూహరచన సమావేశం, కేంద్రమంత్రి జైపాల్రెడ్డితో భేటీ అనంతరం ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. స్పీకరు, డిప్యూటీ స్పీకరు, పిసిసి పదవుల వ్యూహం కోసమే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications