వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై అయోమయం

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీల్లోని తెలంగాణ నేతల్లో అయోమయం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లినట్లేనని కొంత మంది భావిస్తుండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని మరికొందరు భావిస్తున్నారు. అయితే ఇరు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం రావాలని కాంగ్రెసు అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ మాటలు కూడా తెలంగాణ సమస్యకు ఇప్పట్లో పరిష్కారం లభించదనే వాదనను బలపరుస్తోంది. ప్రధాని మన్మోహన్ సింగ్ ను, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీని, కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నోరు విప్పడం లేదు. వారితో తానేమీ మాట్లాడిందీ, వారు ఏం చెప్పిందీ ఆయన బయట పెట్టడం లేదు. దీంతో మరింత అయోమయం చోటు చేసుకుంది.

ప్రస్తుత స్థితిలో అన్ని పార్టీలు కలిసి జెఎసిగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నడపడానికి ఉద్యక్తమైనప్పటికీ ఎవరి ఎత్తుగడల్లో వారున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు పరస్పరం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీని ఇరకాటంలో పెట్టడానికి తెలుగుదేశం నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టించి రాష్టపతి పాలన వచ్చేలా చూసే దిశలో తెలంగాణ ఉద్యమాన్ని నడపడానికి వారు ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. స్పీకర్ కు ఇచ్చిన రాజీనామాలను అమోదింపజేసుకునేందుకు ఒత్తిడి తేవాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ రాజీనామాలు ఆమోదిస్తే రాజ్యాంగ సంక్షోభం వచ్చి తీరుతుంది.

తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి కాంగ్రెసు నాయకులు మరో వైపు ప్రయత్నిస్తున్నారు. తమ వల్లనే తెలంగాణ వచ్చిందని ప్రజల చేత అనిపించుకోవడానికి వారు యత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. దామోదర్ రెడ్డి, జానారెడ్డి వంటి నాయకులు తాము పార్టీ అధిష్టానాన్నైనా ఎదిరిస్తామనే దాకా వెళ్తున్నారు. మంత్రులు మాత్రం తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. మంత్రులు రాజీనామాలు ఉపసంహరించుకోవడంపై తెలుగుదేశం తీవ్ర విమర్శలు చేస్తోంది.

కాగా, రాజకీయ నాయకులు పైచేయి సాధించకుండా ఉద్యమం తమ చేతుల్లో ఉండేలా ప్రజాసంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణ మాదిగ వంటి నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం రాజకీయ నాయకులపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. వీరు ఏ మాత్రం పట్టు విడవడానికి సిద్ధంగా లేరు. వీరు పట్టు మీద ఉండడం వల్లనే రాజకీయ నాయకులు తగిన దారిలో ఉన్నారనే అభిప్రాయం కూడా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X