ముందు జగన్, ఆ తర్వాతే... సిఎం వ్యూహం
ఈ నేపథ్యంలో జగన్తో తిరిగే నాయకుల జాబితాను నియోజకవర్గాల వారీగా తనకు అందచేయాలని సిఎం మంత్రివర్గ సమావేశంలో కూడా ఆదేశించారు. అదే విషయాన్ని పిసిసి అధ్యక్షుడికీ స్పష్టం చేసి, జిల్లాల వారీగా జాబితాను త్వరగా రూపొందించాలని ఆదేశించడం బట్టి కిరణ్ వ్యూహమేమిటన్నది స్పష్టమవుతోంది. వారిని తొలగించి, అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తయారుచేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది కిరణ్ వ్యూహంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. జగన్ వర్గీయులను పూర్తి స్థాయిలో అణచి వేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని ఆరునెలల్లోగా చక్కదిద్దిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్న వ్యూహంతో కిరణ్ అడుగులు వేస్తున్నారు.
పంచాయతీ, మునిసిపల్ ఎన్నికలు వారంరోజుల పాటు వాయిదా వేయడం వెనుక ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి కసరత్తు చేయకుండా, జగన్ వ్యవహారం తేల్చకుండా ఎన్నికలకు వెళితే ఓట్లు చీలిపోయి తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందని కిరణ్ అంచనా వేస్తున్నట్లుగా ఉంది. అందుకే ముందుగా, జగన్ వర్గీయులుగా వ్యవహరిస్తోన్న ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని భావిస్తున్నారు. ఆ మేరకు స్పీకర్తో మాట్లాడాలని కూడా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక నియోజక వర్గ స్థాయిలో కూడా మాజీ ఎమ్మెల్యేలు, పీసీసీ, డీసీసీ స్థాయి నేతలపైనా వేటు వేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. కింది స్థాయిలో నెలకొన్న ఈ గందరగోళాన్ని అరికట్టపోతే కడపలో మాదిరిగా అంతా కలసి కుమ్మక్కయి పార్టీని పుట్టి ముంచుతారన్న ముందుచూపుతోనే కిరణ్ ఇలాంటి వ్యూహం అనుసరించినట్లు కనిపిస్తోంది.