వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుతో పొత్తు: తెలంగాణపై ఎఫెక్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో కాంగ్రెసు పొత్తు వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై వ్యతిరేక ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమైక్యావాదం అందుకుని సీమాంధ్రలో దూకుడుగా వ్యవహరించిన చిరంజీవి కాంగ్రెసుతో దోస్తీ చేస్తే ఆ ప్రభావం తప్పకుండా తెలంగాణపై పడుతుందని అంటున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించేందుకే కాంగ్రెసు అధిష్టానం చిరంజీవితో పొత్తుకు సిద్ధపడిందని అంటున్నారు. చిరంజీవి షరతుల్లో సమైక్యాంధ్రను కాపాడడం అనేది కూడా ఉండే ప్రమాదం ఉందని తెలంగాణ ప్రాంత నాయకులు అంటున్నారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శానససభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి, వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యురాలు కొండా సురేఖ- చిరంజీవితో పొత్తు పెట్టుకోవడమంటే కాంగ్రెసు తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడమేనని అంటున్నారు. తెలంగాణను మోసం చేయడానికే చిరంజీవితో కాంగ్రెసు పొత్తుకు సిద్ధపడిందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి కూడా అన్నారు.

అయితే, చిరంజీవితో పొత్తుపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెసు సీనియర్ నేత కెఆర్ ఆమోస్, కాంగ్రెసు వరంగల్ జిల్లా పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్ చిరంజీవితో దోస్తీని ఆహ్వానిస్తున్నారు. హైదరాబాదుకు చెందిన మంత్రి దానం నాగేందర్ కూడా స్వాగతిస్తున్నారు. తెలంగాణకు చిరంజీవితో పొత్తు వ్యతిరేకం కాదని వీరంటున్నారు. ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని, శ్రీకృష్ణ కమిటీలోని ఆరవ ప్రత్యామ్నాయాన్ని అమలు చేసే ఆలోచనలో ఉందని వార్తలు వస్తున్నాయి. సమైక్యాంధ్రను కాపాడుతూ, తెలంగాణకు రాజ్యాంగ రక్షణలు కల్పించడమనేది శ్రీకృష్ణ కమిటీలోని ఆరవ ప్రత్యామ్నాయం.

కాగా, చిరంజీవి తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఉంది. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులకు కూడా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ స్థితిలో చిరంజీవితో పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెసుకు మరింత వ్యతిరేకత ఎదురవుతుందని భావిస్తున్నారు. చిరంజీవితో పొత్తు లేదా విలీనం ఖరారైన తర్వాత వైయస్ జగన్ వ్యవహారాన్ని ఓ కొలిక్కి తెచ్చి, తెలంగాణ అంశాన్ని తేల్చే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ డిమాండ్‌పై తలెత్తుతున్న ఉద్యమాలను అణచడానికి తగిన మార్గాలను ఎంచుకోవడం అప్పుడే వీలవుతుందని కాంగ్రెసు అధిష్టానం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏమైనా, తెలంగాణకు వ్యతిరేకంగానే చిరంజీవితో దోస్తీ పనిచేస్తుందనే అభిప్రాయం బలపడుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X