వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో సిఎం రచ్చబండ జరిగేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 24వ తేదీ నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రజలను ముఖాముఖి కలుసుకుని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రచ్చబండ కార్యక్రమానికి తీవ్ర వ్యతిరేకత ఎదురువుతోంది. తెలంగాణలో ఈ కార్యక్రమం జరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది. అయితే, అభివృద్ధి ఎజెండాను ముందుకు తెచ్చి తెలంగాణవాదాన్ని నీరు గార్చే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో తన వ్యూహానికి రచ్చబండ కార్యక్రమాన్ని వాడుకోవాలని ఆయన చూస్తున్నారు.

రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను కిరణ్ కుమార్ రెడ్డి శానససభ్యులపై పెడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని సాకుగా తీసుకుని పర్యటించాలని అనుకుంటున్నారు. అయితే, తెలంగాణలో రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టవద్దని ఈ ప్రాంత శాసనసభ్యులు ఆయనకు సలహాలు ఇస్తున్నారు. ప్రస్తుత స్థితిలో తెలంగాణలో పర్యటించకపోవడం మంచిదని తెలంగాణ ప్రాంత మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యులు సలహాలు ఇస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌పై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులపై ప్రజలు మండిపడుతున్నారు. వారిని ఎక్కడికక్కడ నిలదీసేందుకు సిద్ధపడుతున్నారు. తెలంగాణలో పర్యటించాలని ప్రయత్నిస్తున్న సీమాంధ్ర నాయకులందరికీ వ్యతిరేకత ఎదురవుతూనే ఉన్నది. ఈ వాతావరణంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా ముఖ్యమంత్రి తెలంగాణలో పర్యటించకపోవడమే మంచిదని అంటున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి పర్యటన అంత సులభం కాకపోవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X