నరేంద్ర మోడిని వెనక్కి నెట్టిన రాహుల్ గాంధీ
రాహుల్ ప్రధాని కావాలని 42 శాతం కోరుకుంటే మన్మోహన్ సింగ్ ప్రస్తుతం కొనసాగాలని 22 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారంట. ఇక గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి ఓటు వేసిన వారు కేవలం ఐదు శాతం మాత్రమేనంట. బిజెపి నేతలందరితో పోలిస్తే రాహుల్ 19 శాతం ఎక్కువగా ప్రజల అభిమానం చూరగొన్నారంట. రాహుల్ దరిదాపులో ఇటు కాంగ్రెసు, అటు బిజెపి నేతలు ఎవరూ లేక పోవడం విశేషం. రాహుల్ గాంధీ నమ్మదగిన వ్యక్తి అని, ఆయన పేదలపై చూపిస్తున్న ప్రేమ నిజమైనదని 54 శాతం మంది అభిప్రాయపడుతున్నారంట. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా అమెరికాలో చికిత్స పొందుతూ రాహుల్కు తాత్కాలిక పగ్గాలు అందించిన ఈ సమయంలో వారు సర్వే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం.
కాగా పంద్రాగస్టు రోజున కాంగ్రెసు కేంద్ర కార్యాలయంలో జెండా రాహుల్ గాంధీ ఎగుర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ విదేశాలలో ఉండటంతో రాహుల్ గాంధీతో జెండా ఎగుర వేయించాలనే యోచనలో కాంగ్రెసు వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. జెండాను ఆవిష్కరింపజేయడం ద్వారా రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు ఏ సమయంలోనైనా చేపట్టవచ్చుననే సంకేతాలను పంపేందుకు కాంగ్రెసు వర్గాలు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీయే భావి ప్రధాని అనే సంకేతాలు జనాల్లోకి వెళతాయని వారు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.