ఎక్కడైనా 'సింహా', కానీ తెలంగాణలో కాదా?

బాలకృష్ణకు రాష్ట్రవ్యాప్తంగా అభిమానులున్నారు. తెలంగాణలో కూడా ఆయనకు అభిమానులున్నారు. కానీ రాజకీయంగా వచ్చేసరికి తెలంగాణలో బాలకృష్ణ అడుగు పెట్టే పరిస్థితి కూడా ఉండదనేది అంచనా. బాలకృష్ణ తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఎంత మాత్రం లేదు. పాత ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెసు నాయకుడు చిరంజీవి పేరుకు మెగాస్టారే. రాజకీయాలకు వచ్చేసరికి చిరంజీవి తెలంగాణలో అడుగు పెట్టే పరిస్థితి లేదు. బాలకృష్ణ కూడా తెలంగాణలో తిరగలేరనేది స్పష్టం. అందుకే జైపాల్ యాదవ్ ఆ ప్రకటన చేసి ఉంటారని అర్థం చేసుకోవచ్చు.
గతంలో జైపాల్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుర్తి నుంచి స్వర్గీయ ఎన్టీ రామారావు పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఎన్టీ రామారావు రాజకీయ జీవితంలో ఇదో మహా అపజయం. దీన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పుడు బాలకృష్ణ గురించి జైపాల్ యాదవ్ ప్రకటన చేయడం ఈ దృష్ట్యా ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ సమస్య పరిష్కారమయ్యేంత వరకు బాలకృష్ణ తెలంగాణలో అడుగు పెట్టలేరనేది అందరికీ తెలిసిన విషయమే.












Click it and Unblock the Notifications