వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణవారికి ఎక్స్‌ట్రా రోల్సేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jai Bolo Telangana
తెలంగాణ నటీనటులకు ప్రాధాన్యం ఇవ్వకుండా తెలంగాణ వారిని చిత్రసీమలో పక్కన పెడుతున్నారని అందుకే తాను తెలంగాణ నటీనటులతో ఓ గొప్ప చిత్రాన్ని తీస్తానని ప్రకటించిన ప్రముఖ దర్శకుడు శంకర్ తన మాట మీద నిలబడలేక పోయాడు. చిత్రపరిశ్రమలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గొంతు చించుకున్న శంకర్ తాను అదే తానులో ముక్క అనిపించుకున్నాడు. సినిమాను నిర్మించే వారు వారి లాభనష్టాలు, నటీనటులు తదితర ఎన్నింటినో భేరీజు వేసుకొని సినిమా నిర్మాణం చేపడతారు. లాభం లేకుండా ప్రజల గురించి సినిమా తీసే వారు ఇప్పుడు ఎవరూ లేరు. అదే దారిలో సీమాంధ్ర నిర్మాతలు తమ ప్రాంతం నటీనటులకు ప్రాధాన్యత ఇవ్వడంలోనూ తప్పు లేక పోవచ్చు. అయితే తెలంగాణ పేరుతో గొంతు చించుకున్న శంకర్ మాత్రం తను ప్రతిష్టాత్మకంగా తీసిన జైబోలో తెలంగాణ చిత్రంలో తెలంగాణవారికి అవకాశం ఇచ్చారు.

అయితే ఎవరికి అవకాశం ఇచ్చాడు. అందరు నిర్మాతలు, దర్శకులు మాదిరే ముఖ్య పాత్రదారులకు మాత్రం ఇవ్వలేదు. తెలంగాణ నటీనటులపై అంతగా మమకారం ఉన్న ఆయనకు తెలంగాణకు చెందిన ఒక్కరు కూడా ప్రధాన రోల్ పోషించేవారు కనిపించలేదా, తెలంగాణలో ఆ మాత్రం ప్రతిభ ఉన్నవారు లేరా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హీరో ఎవరైనప్పటికీ హీరోకన్నా ప్రధాన పాత్ర సీమాంధ్రకు చెందిన జగపతి బాబుది కాగా మరో ప్రధాన పాత్ర ఉత్తరాదికి చెందిన ప్రముఖ టీవీ నటి స్మృతి ఇరానీది. అంటే శంకర్‌కు జగపతిబాబు, స్మృతి ఇరానీల పాత్రలకు తెలంగాణకు చెందినవారు ఎవరూ దొరకలేదా అని కొంత మంది అడుగుతున్నారు. అంటే ఆయన తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వ్యాపారవస్తువుగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. చిత్రంలో రెండు ప్రధాన పాత్రదారులనే వేరే వారిని పెట్టానని చెప్పినప్పటికీ ఆ ప్రాధాన్యం గల పాత్రలలో ఎవరూ దొరకలేదా అనేది అసలు ప్రశ్న.

హీరోహీరోయిన్లకు కొత్తవారిని తీసుకున్న శంకర్ ఇతర పాత్రలకు తెలంగాణకు చెందిన పది రాష్ట్రాల్లో వెతికి కొత్త వారిని ఎందుకు పట్టుకోలేక పోయాడు. తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ప్రాంతానికి చెందిన శంకరే తెలంగాణ నటీనటులను గుర్తించనప్పుడు సీమాంధ్రులు గుర్తించలేదని వారిని ప్రశ్నించడం ఎంత వరకు సమంజసం. పలువురు తెలంగాణ నటులు సినిమాల్లో అవకాశం లేక సంఘర్షణకు లోనైన వారున్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి శంకర్ వారిని ఎందుకు తీసుకోలేక పోయాడు. ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలేనా. ఉద్యమం పేరుతో వ్యాపార జిమ్మిక్కును శంకర్ ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X