విగ్రహ రాజకీయాలు: జగన్తో బాలయ్య పోటీ
వైయస్ జగన్ విగ్రహ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం కూడా వ్యూహరచన చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఒక్కసారిగా బాలకృష్ణ రాజకీయాల్లోకి దూసుకొచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాలను ప్రారంభిస్తూ ఆయన రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారు. వైయస్ జగన్ రాజకీయాలను దీటుగా ఎదుర్కోవడానికి ఎన్టీఆర్ విగ్రహాలను స్థాపించే పనిని పెద్ద యెత్తున చేపట్టాలని బాలకృష్ణ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో ఆయన ఎన్టీ రామారావు విగ్రహాలను స్థాపించడమే కాకుండా రాజకీయాలను వేడెక్కించే ప్రసంగాలు చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు చంద్రబాబు భయపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత శోభా నాగిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా నాయకుడు లేదంటే మహానాయకుడు ఎవరనే విషయంలో బాలయ్యకు, వైయస్ జగన్కు మధ్య పోటీ నెలకొన్నట్లే చెప్పాలి. విగ్రహాల విషయంలో ఇద్దరు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.