ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కమలాపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం నుండి వైసిపి అధినేత జగన్ మేనమామ రవీంధ్రనాద్ రెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరి స్తున్నారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన తరువాత పెండ్లిమర్రి, చింతకొమ్మ దిన్నె, వల్లూరు మండలాలు కమలా పురం నియోజకవర్గంలో కలిసాయి. ఇక్కడి నుండి కడప జిల్లా సీనియర్ రాజకీయ నేత ఎంవి మైసూరా రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసారు. వీర శివారెడ్డి రెండు సార్లు టిడిపి నుండి..ఒకసారి కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలుపొందారు. రెండు ప్రధాన పార్టీలకు కమలా పురం లో ఎప్పుడూ హోరా హోరీ పోరు జరుగుతూనే ఉంటుంది. గత ఎన్నికల్లోనూ టిడిపి అభ్యర్ధి - వైసిపి అభ్యర్ది మధ్య ఇదే స్థాయిలో పోరు జరిగింది.
14 సార్లు ఎన్నికలు.. 1.86 లక్షల మంది ఓటర్లు..
కడప జిల్లా కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం 1952 లో ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన 14 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి మూడు సార్లు, వైసిపి ఒక సారి, స్వతంత్రులు రెండు సార్లు, సిబిఐ ఒక సారి గెలుపొందాయి. 2014 ఎన్ని కల లెక్కల ప్రకారం ఈ నియోజకవర్గంలో 186981 మంది ఓటర్లు ఉన్నారు. ఇక, 2014 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ మొత్తం గా 156936 ఓట్లు పోలయ్యాయి. అందులో మహిళా ఓటర్లు 79891 ఉండగా, పురుష ఓటర్లు 77038 మంది ఉన్నారు. 2014 ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం లో 83.93 శాతం పోలింగ్ నమోదైంది.
2014 ఎన్నికల్లో జగన్ బంధువు గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో వైసిపి అధినేత జగన్ తన మేనమామ కు కమలాపురం సీటు కేటాయించారు. అప్పటికే ఆయన కడప మేయర్ గా పని చేసారు. వైయస్ మరణం తరువాత వైసిపి నిర్మాణ కార్యక్రమాల్లో రవీంధ్రనాధ్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. రవీంధ్రనాద్ రెడ్డి పై టిడిపి నుండి పుత్తా నరసింహారెడ్డి పోటీ చేసారు. 2004 నుండి వరుసగా మూడు ఎన్నికల్లో పుత్తా నరసింహారెడ్డి టిడిపి అభ్యర్దిగా పోటీ చేస్తూ ఓడిపోతూనే ఉన్నారు. 2014 ఎన్నికల నాటికి ఇక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. వైయస్ మరణం తో ఏర్పడిన సానుభూతి పరిస్థితులను మార్చి వేసింది.