ఎగిరొచ్చిన టీ బిల్లు: వ్యూ ఎలా? (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక విమానంలో చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పంపడమే తరువాయి దాన్ని కేంద్ర హోంశాఖ తన సంయుక్త కార్యదర్శి సురేష్ కుమార్ ద్వారా హైదరాబాద్కు పంపించింది. సురేష్ కుమార్ తెచ్చిన తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను సచివాలయానికి చేర్చి, వెంట వెంటనే చేరాల్సిన వారందరికీ చేర్చారు.
శాసనసభ సచివాలయ కార్యదర్శి సదారాంకు కూడా శుక్రవారం రాత్రే చేరుకుంది. అదే రోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఆ ప్రతిని గవర్నర్ నరసింహన్కు అందించారు. రాష్ట్రపతి వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు గడువు ఇచ్చినప్పటికీ ఈ శాసనసభా సమావశాల్లోనే అభిప్రాయ సేకరణ జరిపించి, ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
విభజన బిల్లుపై శాసనసభ సభ్యులందరి అభిప్రాయాన్ని, అందులో పేర్కోన్న వివిధ క్లాజులపై, విడివిడిగా సభ్యుల అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరారు. వాటిపై మొత్తంగా శాసనసభ అభిప్రాయం ఎలా ఉందనే విషయం చెప్పాలని ఆయన సూచించారు. జనవరి 23వ తేదీలోగా అభిప్రాయాలను సేకరించి తర్వాత వాటిని క్రోడీకరించి పంపించడానికి మరో మూడు రోజల సమయం కూడా రాష్ట్రపతి కేటాయించారు. అంటే రాష్ట్రం నుంచి బిల్లు ముసాయిదాపై అభిప్రాయం జనవరి 25వ తేదీ నాటికి ఢిల్లీకి చేరాల్సి ఉంటుంది.
బిల్లుపై అభిప్రాయం వెల్లడించే సమయంలో సభ్యులు దానికి సవరణలు కోరవచ్చు. విభజన బిల్లును గురువారం రాత్రే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిశీలించినట్లు తెలుస్తోంది. తనను కలిసిన మంత్రులు గంటా శ్రీనివాస రావు, పితాని సత్యనారాయణ, శైలజానాథ్, అహ్మదుల్లాలతో విభజన బిల్లుపై ముఖ్యమంత్రి చర్చించారు. బిల్లునే సీమాంధ్ర సభ్యులు వ్యతిరేకిస్తున్నందున సవరణలు సూచించే బదులు వారు క్లాజులను కూడా పూర్తిగా వ్యతిరేకించే అవకాశం ఉంది.

బండిల్స్ తీస్తూ..
విమానాశ్రయం నుంచి సచివాలయం చేరుకున్న తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతుల బండిల్స్ను కారులో నుంచి తీస్తున్న సిబ్బంది.

మహంతికి బిల్లు ప్రతులు
సచివాలయానికి చేరుకున్న వెంటనే కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి అందించారు.

బండిల్స్ను మోసుకెళ్తూ..
తెలంగాణ ముసాయిదా బిల్లుకు సంబంధించిన 390 ప్రతులను బండిల్స్గా కట్టి తెచ్చారు. వాటిని సచివాలయంలోకి చేర్చారు.

బిల్లు ప్రతులు తెచ్చిన కారు ఇదే..
తెలంగాణ ముసాయిదా బిల్లును విమానాశ్రయం నుంచి సచివాలయం సమతా బ్లాక్ వరకు చేర్చిన కారు ఇదే..

బిల్లు ముసాయిదా కలకలం..
తెలంగాణ బిల్లు ముసాయిదా ప్రతులు సచివాలయానికి చేరిన వెంటనే ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర శాసనసభ్యులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం సభలో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications