టిడిపి ఘనాపాటి రావులపాటి తెలుగుదేశం లోగుట్టు టిడిపిఘనాపాటి రావులపాటితెలుగుదేశంపార్టీ మానవవనరుల అభివృద్ధి
సినీనటిశ్రీదేవితో తన దాంపత్య హక్కులనుపునరిద్ధరించాలని రామకృష్ణ గౌడ్ అనేప్రబుద్ధుడు కోర్టులో ఒక పిటిషన్ వేసికూర్చున్నాడు. తాను శ్రీదేవి పెళ్ళిచేసుకున్నామని, ఆమె కాపురానికిరావడం లేదని ఈ పిచ్చి పెళ్ళికొడుకుకోర్టుకు విన్నవించుకున్నాడు. కోర్టుతన పద్ధతి ప్రకారం కోర్టులో హాజరుకావలసిందిగా శ్రీదేవిని ఆదేశించింది. తనపిటిషన్ మీద స్టేనుఎత్తివేయవలసిందిగా ఇటీవల్ గౌడ్చెన్నై హైకోర్టును ఆశ్రయించాడు.ఒక విధమైన మానసిక వ్యాధితోబాధపడుతున్న గౌడ్ గతంలోప్రియాంక గాంధీ, జయప్రదల మీద కూడాఇటువంటి పిటిషన్లను దాఖలు చేశాడు.ఇటువంటి వారిపై కోర్టు కఠిన చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇటువంటి ప్రబుద్ధులుఇటువంటి ట్రిక్స్ వేయడానికిభయపడతారు.
కోయంబత్తూరుకుచెందిన ఒక నిరుపేద, వికలాంగురాలు నెట్ బ్రౌజింగ్ద్వారా కెనడాలోని ఒక పెద్ద మనిషిని బుట్టలోవేసుకుంది. నువ్వా దరిని, నేనీ దరిని, ఛాటింగ్ కలిపిందిఇద్దరినీ అంటూ ఆమె పాటలు మొదలు పెట్టింది. అతనుఫోటోపంపమన్నాడు. సినీనటి ఆసిన్ ఫోటోనుఆమె పంపింది. ఫోటో చూసి ఇంతఅందగత్తె తనది కావడం నిజంగాఅదృష్టమనుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందుల్లోఉన్నానని ఆమె అనగానే అతనులక్షరూపాయలు పంపించాడు. ఛాటింగ్ నడుస్తూనే ఉంది. కెనడాలో ఉంటున్నశ్రీలంకేయుడైన డారెన్స్ తన నెట్ప్రియురాలి ఫోటో (ఆసిన్)ను స్నేహితుడికిచూపించాడు. అది ఆసిన్ ఫోటో కావడంతో నువ్వుమోసపోయావని మిత్రుడు చెప్పాడు. వెంటనే డారెన్స్కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వికలాంగురాలిని అరెస్టుచేశారు.
నక్సలైట్లపైనిషేధం విధించిన తర్వాత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిభద్రతకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.ఆయన హాజరయ్యే సభల వద్ద మఫ్టీలోఎక్కువ మంది పోలీసులు కన్పిస్తున్నారు.ఆయన ప్రయాణించే దారుల పొడవునా బాధ్యత గలపోలీసు అధికారులను నియోగిస్తున్నారు. అధికారంలోకి వచ్చినకొత్తలో వైఎస్ తన వల్ల ప్రజలు ట్రాఫిక్సమస్యలు ఎదుర్కోనవసరం లేదని,సిగ్నల్స్ వద్ద తన కాన్వాయ్ ఆగుతుందని చెప్పినా, ఇప్పుడుపరిస్ధితులు మారిపోయాయి. చంద్రబాబు నాయుడుముఖ్యమంత్రిగా ఉండగాఎంతటి హంగూ ఆర్భాటాలు ఉండేవో అవన్నీవైఎస్ కు వచ్చేశాయి. ఒక రిలీఫ్ ఏమిటంటేవిమానాశ్రయం నుంచి సచివాలయానికివెళ్ళేటప్పుడు హెలికాప్టర్ వాడుతున్నారు కాబట్టిట్రాఫిక్ సమస్యలుతగ్గాయి.