హోంపేజి
వరంగల్ హైవేలో ఉన్న సింగపూర్ టౌన్షిప్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఎక్కడో సుదూరంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ టౌన్షిప్ను రాష్ట్ర హౌసింగ్ బోర్డు ప్రమోట్ చేసింది. పెట్టుబడికి ఎటువంటి ఢోకా లేకపోయినా ఇక్కడ ఫ్లాట్స్ కొనడానికి మొదట జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎప్పుడైతే ఇదే హౌసింగ్ బోర్డు కుకట్పల్లిలో మలేషియన్ సిటీ పేరిట ఫ్లాట్స్ను నిర్మించిందో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. హైటెక్ సిటీకి నేరుగా ఇక్కడి నుంచి రోడ్ ఏర్పాటు కావడం, నాలుగు కిలోమీటర్ల దూరంలో హైటెక్ సిటీ ఉండడంతో టెకీలు మలేషియన్ టౌన్షిప్ వైపు వేలంవెర్రిగా వస్తుండడంతో ఇక్కడ రెండు బెడ్రూమ్ల ఫ్లాట్ దాదాపు 30 లక్షలు పలుకుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమింగ్ పూల్స్, లాన్స్ వంటి వాటితో అభివృద్ధి చేసిన మలేషియా టౌన్ షిప్కు, సింగపూర్ టౌన్షిప్కు మధ్య డిమాండ్ విషయంలో ఇంత తేడా రావడం ఆశ్చర్యం కలిగించిక మానదు. ఘట్కేసర్ వద్ద ఉన్న సింగపూర్ టౌన్షిప్లో ఇప్పటికీ రెండు బెడ్రూముల ఫ్లాట్ 12 లక్షలు మాత్రమే ఉంది. వరంగల్ జిల్లాకు చెందిఅన వారికి ఇది బెస్ట్ బై.
చంద్రశేఖరరావు
పూర్వీకులు
శ్రీకాకుళం
వారా?
ఈ
మీడియాకు
ఎందుకింత
తుత్తర?