హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చల్లబడిన జగన్ వర్గం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు చేరుకుని తన తండ్రిగారు బతికున్నప్పుడు ముఖ్యమంత్రిగా అధికార నివాసమైన గ్రీన్ ల్యాండ్స్ క్యాంప్ ఆఫీసుకు మకాం మార్చారు. ఎంతో విశాలమైన ఈ బంగళాలో జగన్ దాదాపు నెలరోజుల పాటు ఉంటారు. ఈలోపు ఆయన తన రాజకీయ భవిష్యత్ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు.

జగన్ ఈ క్యాంప్ ఆఫీసుకు రాగానే బిలబిల మంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారన్న ప్రచారం జరిగింది. కానీ మొదటి గంటలో అక్కడికి ఎమ్మెల్యే సినీనటి జయసుధ, వట్టి వసంతకుమార్ మినహా ఎవరూ రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత కొందరు కలిశారు కానీ వారు భయం భయంగానే అధిష్టానానికి తెలిస్తే ఏమవుతుందో అన్నట్టు వ్యవరించారు. వైఎస్ వట్టి వసంతకుమార్ ను ఎన్నో కుంభకోణాల నుంచి రక్షించారు. జయసుధకు ఆ క్రిష్టియన్ మతానుబంధం, విశ్వాసం ఉంది. జగన్ హైదరాబాద్ రాగానే ఆకాశం బద్దలవుతుందని ఊహించిన ఆయన శిబిరం మేధావుల్లో భయం గూడు కట్టుకున్నట్టు కన్పిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X