వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురంధరేశ్వరికి రాజమండ్రి?

By Staff
|
Google Oneindia TeluguNews

Purandeswari
ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరికి ఒక మంచి నియోజకవర్గం చూపించడంలో కాంగ్రెస్ అధిష్టానవర్గం విజయం సాధించినట్టు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల లోక్ సభ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో ఆమె మరో స్ధానం చూసుకోవలసి వచ్చింది. మొదట గుంటూరు అనుకున్నా అక్కడ రాయపాటి ఉండడంతో కుదరలేదు. రెడ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సరావుపేట, నెల్లూరు స్ధానాలపై ఆమె కన్ను పడినా సిఎం రాజశేఖరరెడ్డి వారించినట్టు తెలుస్తోంది.

పునర్విభజన తర్వాత అనేక కమ్మ గ్రామాలు రాజమండ్రి లోక్ సభ స్ధానం పరిధిలోకి వచ్చాయి. అందువల్ల పురంధరేశ్వరికి అదే సురక్షితమైన స్ధానమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజమండ్రి స్ధానానికి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండవల్లి అరుణ్ కుమార్ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్ల్ పోటీ చేయడానికి భయపడుతున్నారు. రామోజీరావు భయం ఒకటి కాగా, అక్కడ బ్రాహ్మణ ఓట్లు స్వల్పంగా ఉండడం, తన కుడి భుజమైన జక్కంపూడి రామ్మోహనరావు అస్వస్ధుడు కావడంతో ఉండవల్లి పోటీకి జంకుతున్నారు. అనువాదకుడిగా సోనియాగాంధీకి సన్నిహితుడైన ఆయనను ఈసారి రాజ్యసభకు పంపించాలనుకుంటున్నారు. ఇక రాజమండ్రిలో పూరంధరేశ్వరిపై పోటీకి తెలుగుదేశం పార్టీ కమ్మ కులానికే చెందిన మాజీ ఎంపీ మూర్తిని నిలబెట్టాలనుకుంటోంది. ఆ పోటీ ఆసక్తికరమే మరి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X