వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట శ్రీనివాసరావు వాస్తు బాగాలేదా?

By Santaram
|
Google Oneindia TeluguNews

kota Srinivas Rao
ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ మరణం అందరినీ బాధపెట్టింది. నటుడిగా ఎంతో ఉన్నత స్ధాయిలో ఉన్న కోటకు సినిమారంగంలో మంచి వ్యక్తిగా పేరుంది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ఆయన అందరితో కలివిడిగా ఉంటారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు పుత్రశోకంతో కుంగిపోతున్నారు. కోట శ్రీనివాసరావుకి జూబిలీహిల్స్ లో చాలా అందమైన ఇల్లు ఉంది. మొదటి నుంచి ఆయనకు వాస్తు స్పృహ ఎక్కువ. తన ఇల్లు సెంట్ పర్సెంట్ వాస్తుతో ఉందని ఆయన మిత్రులకు చెబుతుండేవారు.

1998 లో ఆయన కుమార్తెకు యాక్సిడెంట్ అయింది. గాయాలతో బయటపడి ఆమె ప్రాణాలను దక్కించుకుంది. నిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుటుంబానికి ఎంతో సంపదను కోట సమకూర్చిపెట్టాడు. కుమారుడి కుటుంబం కూడా కోట ఇంట్లోనే ఉంది. 35 ఏళ్ళకే అతను అకాల మరణం చెందడానికి కారణమేమిటి? అంత మంచి వాస్తు ఉన్న అంత పెద్ద ఇంటికి వారసుడైన ప్రసాద్ ఎందుకు అకాల మరణం పాలయ్యాడు. దీనిపై వాస్తు నిపుణులు చర్చించుకుంటున్నారు. ఎప్పుడూ కారులో తిరిగే ప్రసాద్ టూవీలర్ లో ఎందుకు వెళుతున్నాడు? ఆ టూవీలర్ నెంబర్ 8474. 4 తో ముగిసే నెంబర్లు అశుభమని చైనాలో ఒక నమ్మకం ఉంది.

చైనా వాస్తు, జ్యోతిషానికి సంబంధించి ఫెంగ్ షు శాస్త్రాలు ఆదే విషయాన్ని చెబుతున్నాయని ప్రముఖ ఫెంగ్ షు మాస్టర్ చీరాల ప్రసాద్ దట్స్ తెలుగుకు చెప్పారు. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నప్పటికీ ఫోన్ లో ఈ సైట్ కు ఈ వివరాలను తెలియజేశారు. 70 ఏళ్ళ వయసులో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా ఉన్న కోట శ్రీనివాసరావుకు అచ్చివచ్చిన వాస్తు పిల్లలకు ఎందు పనికిరాకుండా పోయిందన్న విషయం పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. వాస్తుకు సంబంధించి తెలిసిన విషయాలకంటే తెలియని విశేషాలు ఎన్నో ఉన్నాయన్న విషయం ఇప్పుడు బయటికి వచ్చింది.

వాస్తుకు సంబంధించి ఇప్పుడు ప్రచారంలో ఉన్న వాస్తు పండితుల కంటే సిద్ధులు, పీఠాధిపతులకు దివ్య దృష్టి ఉంది. అయితే వారు ఆ నాలెడ్జిని తరచుగా ఉపయోగించరు. ఏదైనా ఇంట్లోకి వెళితే వారికి అక్కడ ఏదో వాస్తు దోషం ఉందన్న విషయం తెలిసిపోతుంది. ఇందిరా గాంధీ తన మరణానికి కొద్ది రోజుల ముందు బొంబాయిలో ఉండే ప్రముఖ జ్యోతిష, వాస్తు పండితుడు అయ్యర్ ను పిలిపించుకున్నారు. ఆమె త్వరలో కాల్పుల్లో మరణించబోతుందన్న విషయాన్ని గ్రహించిన ఆ పండితుడు ఏమీ చెప్పకుండా టీ తాగి బయటికి వచ్చారు. ఇన్ని విషయాల చర్చ తర్వాత తెలుస్తున్నది ఏమిటంటే జ్యోతిష, వాస్తు పండితులకు పుస్తక నాలెడ్జి కంటే దివ్య దృష్టి ఉండాలన్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X