వైయస్ జగన్ వైఫల్యం, నాయకత్వ నాశనం
జగన్ను సమర్థించే పిసిసి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, కిసాన్సెల్ కార్యాలయ కార్యదర్శి గట్టు రామచంద్రరావును పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇన్ని రోజులవుతున్నా, వాటిని ఎత్తివేయించేందుకు జగన్ ఇంతవరకూ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, ఢిల్లీలో ఉన్నప్పటికీ, ఆ మేరకు అధిష్ఠానంతోచర్చలు జరపకపోవడం జగన్ శిబిరంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొండా సురేఖ, అంబటికి అన్యాయం జరిగిందని, వారికి న్యాయం చేసేందుకు ఎవరితో నయినా మాట్లాడతానని కాకినాడలో చెప్పి 8 రోజులవుతున్నప్పటికీ, ఆ మేరకు జగన్ కనీస ప్రాథమిక ప్రయత్నం కూడా చేయకపోవడంతో ఆయన సమర్థతపై చర్చ మొదలయింది.
కొండా సురేఖకు షోకాజ్ నోటీసు జారీ చేసిన నేపథ్యంలో వైయస్ వర్గీయులు కొందరు దానిని వ్యతిరేకించగా, వ్యతిరేకవర్గం మాత్రం స్వాగతించింది. అయితే, జగన్ మాత్రం ఇంతవరకూ షోకాజ్పై నోరు మెదపక పోవడం ఆయన సొంత శిబిరంలోనే విస్మయం వ్యక్తమవుతోంది.