వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 నుంచి జగన్ ఎమ్మెల్యేల సమీకరణ కార్యక్రమం

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
రోశయ్యను, కాంగ్రెసు అధిష్టానర్గాన్ని ఇబ్బందిలో పడేయడానికి జగన్ వర్గం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. రోశయ్య ప్రభుత్వాన్ని పడగొట్ట డం ద్వారా పార్టీని చీల్చాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్న జగన్‌ శిబిరం ఆ మేరకు జోరుగా సన్నాహాలు చేసుకుంటోంది. ఆగస్టు 8 నుంచి 27 వరకూ ఎమ్మెల్యేల సమీకరణ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ తర్వాత శ్రావణమాసంలో పార్టీని స్థాపించాలని యోచిస్తోంది. వైయస్ వర్థంతయిన సెప్టెంబర్‌ 2న 'వైయస్ కాంగ్రెసు‌" పార్టీ పేరును ప్రకటించనున్నట్లు సమాచారం.

సొంతపార్టీ తప్పదన్న అభిప్రాయానికి జగన్ వర్గం మేధావులు వచ్చినట్టు తెలుస్తోంది. తనకు మద్దతుగా నిలిచిన మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ పైనా వేటు పడనుందని, మంత్రివర్గ విస్తరణలో ఆయనను తొలగించవచ్చని, జగన్‌తో పాటు మొదటి నుంచి మద్దతుదారులుగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలపైనా అధిష్ఠానం చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతాలు జగన్‌ శిబిరానికి అందినట్లు సమాచారం. అదే సమయం లో తన మద్దతుదారులు, కుటుంబసభ్యులపై రోశయ్య ప్రభుత్వం నిఘా పెట్టి, వారిని ఇబ్బంది పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న వైనంకూడా జగన్‌ను మరింత రెచ్చగొట్టేలా చేస్తోందంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X